డ‌బుల్ ఇస్మార్ట్‌: ఈసారి ‘చిప్‌’ ఎవ‌రిది?

పూరి జ‌గ‌న్నాథ్ రాసుకొన్న‌ డిఫరెంట్ క‌థ‌ల్లో ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’ ఒక‌టి. హీరో మెద‌డులో చిప్ పెట్టి – దాని చుట్టూ కావ‌ల్సినంత యాక్ష‌న్, డ్రామా, వినోదం న‌డిపించేశారు. ఆ పాయింట్ కొత్త‌గా అనిపించింది. ఇప్పుడు ‘డ‌బుల్ ఇస్మార్ట్‌’ వ‌స్తోంది. ఇందులో పూరి కొత్త‌గా ఏం చెప్ప‌బోతున్నాడు? కొత్త‌గా ఏం చూపించ‌బోతున్నాడు? అనే ఆస‌క్తి నెల‌కొంది అంద‌రిలోనూ.

అయితే ఈసారి కూడా పూరి ‘చిప్‌’నే న‌మ్ముకొన్నాడు. కాక‌పోతే.. చిప్ మారిందంతే. ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’లో స‌త్య‌దేవ్ చిప్‌.. రామ్ లో ఫిక్స్ చేస్తారు. ఈసారి.. సంజ‌య్ ద‌త్ చిప్ వాడార‌ని టాక్‌. సంజూభాయ్ ఈ సినిమాలో ప్ర‌తినాయ‌కుడిగా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అత‌ని మెమొరీని హీరోలో ఇంజెక్ట్ చేస్తారు. ఆ త‌ర‌వాత జ‌రిగే డ్రామానే ‘డ‌బుల్ ఇస్మార్ట్’ క‌థ‌. ప్ర‌స్తుతం ముంబైలో ఓ కీల‌క‌మైన షెడ్యూల్ న‌డుస్తోంది. దీంతో టాకీ పూర్త‌వుతుంది. ఆ త‌ర‌వాత పాట‌ల్ని హైద‌రాబాద్ లోనే తెర‌కెక్కిస్తారు. మ‌ణిశ‌ర్మ ఈ చిత్రానికి బాణీలు స‌మ‌కూరుస్తున్న సంగ‌తి తెలిసిందే. ‘ఇస్మార్ట్ శంక‌ర్లో’ పాట‌ల‌న్నీ హిట్టే. ఈసారి అంత‌కు మించిన ఆల్బ‌మ్ రాబోతోంద‌ని టాక్‌. మూడు మాస్ పాట‌ల్ని ఈ సినిమా కోసం మ‌ణిశ‌ర్మ కంపోజ్ చేశారు. అమ్మ సెంటిమెంట్ తో ఓ పాట కూడా ఉంద‌ని టాక్‌. త్వ‌ర‌లోనే టీజ‌ర్ విడుద‌ల చేసేందుకు చిత్ర‌బృందం స‌న్నాహాలు చేస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ బెంగళూర్ టూర్.. కథేంటి?

ఇప్పటికే ఇండియా కూటమికి చేరువయ్యేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రచారం గుప్పుమంటోన్న నేపథ్యంలో జగన్ బెంగళూర్ పర్యటన సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఇటీవలే హడావిడిగా బెంగళూర్ నుంచి వచ్చి..ఆపై ఢిల్లీ ధర్నా అని చెప్పి...అక్కడి...

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close