సుభాష్ : ఏపీ సర్కార్ పరువు తీసిన ఉద్యోగాల ప్రహసనం ..!

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికయ్యారంటూ… దాదాపుగా లక్షమందికిపైగా నియామకపత్రాలు అందజేశారు. కానీ అసలు తాము ఎందుకు ఎంపికయ్యాయో… ఎంపికైన వాళ్లకి క్లారిటీ లేదు. ఎందుకు కాలేదో.. పరీక్ష రాసి ఫెయిలయిన వాళ్లకూ తెలియలేదు. అసలు ఎవరెవరికి ఎన్ని మార్కులొచ్చాయో.. కటాఫ్ ఏంటో ఎవరికీ తెలియదు. రాత్రికి రాత్రి రూల్స్ మార్చేశారు. అసలు ఇన్ని సందేహాల మధ్య ఉద్యోగాల భర్తీ జరిగింది. కాల్ లెటర్లు ఇచ్చిన వారికి ఉద్యోగాల్లేవన్నారు. అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చిన వారికీ అదే మాట ఎదురయింది. అసలేం జరిగిందో.. ప్రభుత్వానికైనా తెలుసో లేదో..?

నోటిఫికేషన్ నుంచి ఒక్క ప్రక్రియ అయినా సక్రమంగా సాగిందా..?

ఉద్యోగాల భర్తీ అంటే… ఓ పద్దతి ఉంటుంది. నోటిఫికేషన్ వెలువరిస్తారు. అందులో ఉన్న నియమ నిబంధనల ప్రకారం.. భర్తీ చేస్తారు. ఈ ప్రక్రియలో పారదర్శకతకు పెద్ద పీట వేస్తారు. ప్రశ్నాపత్రాల లీకేజీ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. లీకేజీ జరిగినట్లు అనుమానాలు తలెత్తిస్తే.. సమగ్రమైన విచారణ జరుపుతారు. అంతే కాని అక్రమంగా మార్కులు తెచ్చుకున్న వారికి ఉద్యోగం కట్టబెట్టే ప్రయత్నమే చేయరు. ఫలితాల ప్రకటన తర్వాత కటాఫ్ మార్కులు వెల్లడిస్తారు. ఏమైనా అభ్యంతరాలుంటే స్వీకరిస్తారు. అంతకు మించి.. చివరి క్షణంలో నియమ నిబంధనల్లో ఎలాంటి మార్పులూ చేయరు. అలా జరిగితే.. ఉద్యోగ నియామకాలు ఎలాంటి లోపాలు లేకుండా జరిగాయని అర్థం. కానీ గ్రామ, సచివాలయ ఉద్యోగాల భర్తీ అలా జరిగిందా.. అంటే… వంద శాతం లేదనే చెప్పాలి. ప్రతీ దశలోనూ… ఉద్యోగల భర్తీ ప్రక్రియపై అనుమానాలు తలెత్తాయి…

ఎవరికి ఉద్యోగాలివ్వాలో.. వారికి తగ్గట్లుగా రూల్స్ మార్చేసుకుంటారా..?

రివర్స్ టెండరింగ్‌కు వెళ్లిన ఏపీ సర్కార్.. ముందుగా రూల్సేమీ పెట్టుకోలేదు. ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో.. వారికి సరిపోయే రూల్స్‌ను చివరి వరకూ మారుస్తూ వెళ్లింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల భర్తీలో కూడా అదే విధానాన్ని పాటిస్తున్నారు. రాత్రికి రాత్రే రూల్స్ మార్చేశారు. కాల్‌ లెటర్లు అందుకుని ఉద్యోగానికి ఎంపికయ్యామన్న ఆనందంతో.. సర్టిఫికెట్ల వెరీఫికేషన్ కి వెళ్లిన వారికి.. గేట్ల దగ్గరే… నిరాశ ఎదురవుతోంది. పేపర్ లీకేజీ దగ్గర్నుంచి ఈ సమస్య ఉంది. ఒక సామాజికవర్గం వారికే.. జనరల్ కోటాలో.. అత్యధిక ఉద్యోగాలు వచ్చాయని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కొంత మంది కోచింగ్ సెంటర్ల యజమానులు ర్యాంకర్లను తమ ముందుకు తీసుకు వస్తే.. అసలు వారికి ఎలా ర్యాంకులు వచ్చాయో బయట పెడతామని సవాల్ చేశారు. అంతే కాదు.. గ్రూప్స్ , సివిల్స్ పరీక్షల్లో.. మంచి ప్రతిభ చూపిన వారికి… 70 మార్కుల వరకూ రాగా… టాపర్లకు 115 మార్కుల వరకూ వచ్చాయి. ఈ టాపర్లు గతంలో ఏ ఉద్యోగ పరీక్షలోనూ.. కనీసం ప్రాధమిక పరీక్షను కూడా దాటిన వాళ్లు కాదనే విమర్శలు ఉన్నాయి

నిరుద్యోగుల్లో అలజడి ప్రభుత్వానికే ప్రమాదకరం..!

ఇలాంటి వాటిపై పరీక్షలు అభ్యర్థుల సందేహాలకు సమాధానాలివ్వడానికి ఏపీ సర్కార్ ఏ మాత్రం.. ఆసక్తి చూపించడం లేదు. సరికదా.. అంతకంతకూ గోప్యతను పెంచకుంటూ పోయారు. విభాగాల వారీగా ఇంత వరకూ మెరిట్ లిస్ట్ ప్రకటించలేదు. జిల్లాల వారీగా ఉద్యోగాలకు ఎంపికయిన వారి జాబితా అసలు ప్రకటించలేదు. వారికెన్ని మార్కులు వచ్చాయో కూడా చెప్పడం లేదు. అదే సమయంలో.. అనేక మందికి… తక్కువ మార్కులొచ్చినప్పటికీ.. కాల్ లెటర్లు అందుతున్నాయి. ఈ విషయం తెలియడంతో.. ఇతర అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. తమకే ఎక్కువ మార్కులొచ్చాయని… తమకు ఉద్యోగం రావాలి కానీ.. తక్కువ మార్కులొచ్చిన వారికి ఉద్యోగం ఎలా వచ్చిందని అసంతృప్తి చెందుతున్నారు. నిజానికి అసలు సచివాలయ ఉద్యోగుల పరీక్షలు చట్టబద్ధమేనా అన్న చర్చ ప్రారంభమయింది. పంచాయతీరాజ్‌ శాఖ నోటిఫికేషన్లు ఇచ్చి.. ఉద్యోగ నియామకాలు చేపట్టింది. అలా.. ఏ శాఖకు ఆ శాఖ ఉద్యోగుల్ని నియమించుకునే సంప్రదాయం లేదు. శాశ్వత ఉద్యోగుల్ని ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. కానీ శాశ్వత ఉద్యోగాలని చెబుతూనే… గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీని మాత్రం ఏపీపీఎస్సీకి ఇవ్వలేదు. దీని వల్ల నష్టపోయేది ఎవరు..? అర్హులు కాని వారితో ఉద్యోగాలు నింపితే.. నిరుద్యోగుల్లో అలజడి రేగదా..? ప్రభుత్వ మౌనం.. ప్రమాదకరం కాదా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘మిరాయ్‌’… 20 రోజుల్లోనే ఇంత తీశారా?

https://www.youtube.com/watch?v=xnubQ829q0c తేజ స‌జ్జా, కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి 'మిరాయ్‌' అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు తెలుగు 360 ముందే చెప్పింది. ఇప్పుడు అదే...

కోమ‌టిరెడ్డిలో మ‌రో కోణం… కొడుకు పేరుతో సేవ!

నిత్యం ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు... వేలాది మంది కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు.. హ‌డావిడి. వైఎస్ హాయం నుండి వేగంగా ఎదిగిన మంత్రి కోమటిరెడ్డి, సేవా కార్య‌క్ర‌మాల్లోనూ నేనున్నా అని అండ‌గా ఉంటారు. ముఖ్యంగా కోమ‌టిరెడ్డి కుమార్...

పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా వెంకటేష్ నేత..?

తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాలపై కన్నేసిన బీజేపీ ప్రచారంలో వెనకబడిన అభ్యర్థులను మార్చాలని నిర్ణయం తీసుకోనుందా..? సర్వేలతో ఎప్పటికప్పుడు రాష్ట్రంలో పరిస్థితిని తెలుసుకుంటున్న జాతీయ నాయకత్వం పెద్దపల్లి లోక్ సభ అభ్యర్థిని మార్చనుందా..?...

మూడు రోజులు బయటకు రాకండి… వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!

తెలుగు రాష్ట్రాల్లో భానుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. రానున్న మరో మూడు రోజులపాటు 3 నుంచి 5 డిగ్రీల సెంటిగ్రేడ్ ల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close