దుబ్బాక రేసు ప్రారంభించేసిన నేతలకు ఈసీ షాక్..!

దుబ్బాక ఉపఎన్నికకు షెడ్యూల్ వచ్చేస్తుందని పరుగులు పెడుతున్న రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించింది కానీ ఉపఎన్నికలను నిర్వహించాలని మాత్రం నిర్ణయించుకోలేదు. కొద్ది రోజుల బీహార్ అసెంబ్లీతో పాటే దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 60కి పైగా అసెంబ్లీ స్థానాలను కూడా భర్తీ చేసేందుకు ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ చెప్పింది. అయితే ఇప్పుడు కేవలం బీహార్ కు మాత్రమే షెడ్యూల్ రిలీజ్ చేసింది. దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు.. వర్షాలు, కరోనా పానడమిక్ కారణంగా ఉపఎన్నికలపై మళ్లీ నిర్ణయం తీసుకుంటామని ఈసీ చెబుతోంది.

దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆగస్టు మొదటి వారంలో మృతి చెందారు. ఆరు నెలల కాలంలో ఉపఎన్నిక నిర్వహించాల్సి ఉంది. అయితే బీహార్ ఎన్నికలతో పాటే ఉపఎన్నిక నిర్వహించేస్తారనుకున్న రాజకీయ పార్టీలు నెల రోజుల నుంచే సన్నాహాలు ప్రారంభించాయి. ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్ఎస్ బాధ్యతలు తీసుకుంటున్న హరీష్ రావు రోజూ అక్కడే పర్యటిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు. రాజకీయ సభలు.. సమావేశాలు పెడుతున్నారు. రైతుల్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మరింత జోరుగా ప్రచారం కూడా చేసేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపిక ప్రయత్నాలు చేస్తోంది.

ఇప్పుడు వీరందరూ ముందే తొందరపడినట్లయింది. సాధారణంగా ఓ ఎమ్మెల్యే చనిపోతే వచ్చే ఉపఎన్నికకు పెద్ద హడావుడి ఉండదు. కానీ దుబ్బాక విషయంలో మాత్రం.. ఫుల్ రేస్ నడుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేయకపోవడం అన్న మాటే వినిపించడం లేదు. తెలంగాణ జనసమితి కూడా పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఇప్పటికే ఎలక్షన్ ఫీవర్ అక్కడ తారస్థాయికి చేరింది. ఇప్పుడు షెడ్యూల్ రాకపోవడంతో కాస్త నెమ్మదించే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close