ఎడిటర్స్ కామెంట్ : ఉపయోగించుకున్న వారిదే “ప్రజాస్వామ్యం” !

” Democracy belongs to those who exercise it.. ”

ప్రజాస్వామ్యం ఎవరిది అంటే.. ఆ ప్రజాస్వామ్యాన్ని ఎవరైతే ఉపయోగించుకుంటారో వారికే చెందుతుంది. బిల్ మోయర్స్ అనే అమెరికన్ రాజకీయవేత్త చెప్పిన మాట .. ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలన్నింటికీ వర్తిస్తుంది. ప్రపంచంలో నే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం… అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అయిన భారత్‌కూ వర్తిస్తుంది. కానీ మన దేశానికి వచ్చే సరికి ప్రజాస్వామ్య వినియోగం అనేది ప్రజల చేతుల్లో లేదు. రాజకీయ పార్టీల చేతుల్లో ఉంది. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు ఏది చెబితే అది ప్రజాస్వామ్యం..! ఏది చేస్తే అది ప్రజాస్వామ్యం ! దానికి తాజాగా ఉదారహరణ మహారాష్ట్ర ” ప్రజాస్వామిక” రాజకీయాలు.

మహారాష్ట్రలో శివసేన ఎమ్మెల్యేల డెమెక్రసీ టూర్ !

మహారాష్ట్రలో రాజకీయసంక్షోభం చాలా మందిని ఆశ్చర్యపర్చలేదు. ఎందుకంటే బాల్ ధాక్రే వారసుడిగా ఉద్దవ్ ధాకరే తనదైన ముద్ర వేయలేదు. ముఖ్యమంత్రిగా ఆయన రాజనీతి పాటించారు. శివసేన సిద్ధాంతాలు ఆ రాజనీతిని ఎప్పుడూ పాటించలేదు. ఒకరిపై ఒకరిని ఎగదోసి రాజకీయం చేసి బలపడిన పార్టీ అది.కానీ ఉద్దవ్ మాత్రం పాలకుడిగా అలా చేయడం సమంజసం కాదనుకున్నారు. కానీ అదే ఆయనకు కుర్చీ కిందకు నీళ్లు తెచ్చింది. శివసైనికుల్లో ఎవరూ ధాకరేల మాట జవదాటరు అనుకుంటే.. కట్ట కట్టుకుని ఎమ్మెల్యేలంతా ఆయనను కాదని వెళ్లిపోయారు. వారు అలా వెళ్లారంటే.. వారికి అంతకు మించిన అధికారం అండ లభించిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారు చేసింది తప్పా అంటే కానే కాదు. అదే ప్రజాస్వామ్యం. ముందే చెప్పుకున్నట్లుగా వినియోగించుకున్న వాడిదే ప్రజాస్వామ్యం. ఆ ప్రకారం ఇప్పుడు శివసేన ఎమ్మెల్యేలు తమ ప్రజాస్వామ్య హక్కును ఉపయోగించుకున్నారన్నమాట. వారి వెనుక మూటలు మాట్లాడాయా..? మాటలు మాట్లాడాయా అన్నది తర్వాతి విషయం.

బీజేపీ ఆశీస్సులు లేని సంకీర్ణ ప్రభుత్వాలన్నింటికీ అదే గతి !

మహారాష్ట్ర మొదటిది కాదు చివరిది కాదు. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి… బీజేపీ వచ్చిన తర్వాత రాజకీయాలను చూస్తే.. తమ ప్రమేయం లేని సంకీర్ణ ప్రభుత్వాలన్నింటినీ కూలగొట్టేసింది. తమ ప్రమేయంతో ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంది. అది అతి చిన్న ఈశాన్య రాష్ట్రమైనా.. అత్యంత కీలకమైన బీహార్, కర్ణాటక అయినా అంతే. ఇప్పుడు మహారాష్ట్ర వంతు వచ్చింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఓటర్ల సంఖ్య తక్కువే. సీట్ల సంఖ్య కూడా తక్కువే. అయినప్పటికీ అక్కడ నడిచేది సంకీర్ణ ప్రభుత్వాలే. ఇలాంటి ప్రభుత్వాలు శరవేగంగా కూలిపోయాయి. మళ్లీ ఏర్పటయ్యాయి. అయితే అక్కడ కేంద్రంలో ఉన్న పార్టీ మద్దతుతోనే ఏర్పటయ్యాయి. కొనసాగుతున్నాయి. అదే పరిస్థితి పెద్ద రాష్ట్రాల్లోనూ ఉంది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ పూర్తి సీట్లు రాలేదు. మెజార్టీకి అవసరం అయిన సీట్లు కొన్ని తక్కువే సాధించింది. ఇండిపెడెంట్ల మద్దతులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ చివరికి.. నిలబెట్టుకోలేకపోయింది. అక్కడ బీజేపీ ప్రభుత్వమే మళ్లీ వచ్చింది. అదే పరిస్థితి కర్ణాటకలోనూ వచ్చింది. కర్ణాటకలో పార్టీలన్నీ విడివిడిగా పోటీ చేసినా ఎన్నికల తర్వాత కాంగ్రెస్, జేడీఎస్ కలిశాయి. కానీ బీజేపీ కొన్నాళ్లు వేచి చూసి వాళ్లంతటకు వాళ్లు కూలిపోకపోయే సరికి ఆపరేషన్ కమల్ పూర్తి చేసింది. ఇప్పుడు అక్కడ బీజేపీ ప్రభుత్వమే ఉంది. మహారాష్ట్రలోనూ అదే పరిస్థితి. చూస్తూంటే రేపోమాపో మహారాష్టర్ కూడా బీజేపీ పాలిత రాష్ట్రం అయ్యే సూచనలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. అంటే.. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తమకు ఉన్న బలంతో ప్రజాస్వామ్యాన్ని చాలా చక్కగా ఉపయోగించుకుంటోంది. ఎక్కడా చట్ట విరుద్ధం.. రాజ్యాంగ విరుద్ధం అన్న ప్రశ్నే లేదు. పైగా ప్రజాస్వామ్యం అంటున్నారు.

మెజార్టీ మీద నడిచే ప్రజాస్వామ్యంలో ఏదీ తప్పు కాదు ! బలమే ఫైనల్ !

భారతదేశం ప్రజాస్వామ్యం మెజార్టీ మీద ఆధారపడి ఉంది. మెజార్టీ అభిప్రాయమే గెలుపు. వంద మందిలో ముఫ్పై మంది మాత్రమే ఓట్లు వేసినా… ఇతరులు ఎవరూ 31 ఓట్లు తెచ్చుకోకపోతే గెలుపు 30 ఓట్లు తెచ్చుకున్నవారిదే. వారే పాలకులు. మచట్టసభలో అయితే మెజార్టీ మార్క్ తెచ్చుకోవాలి. సభలో ఉన్న చట్టసభ సభ్యుల కంటే ఒక్కరి మద్దతు అధికంగా పొంది.. మెజార్టీ ఉందని నిరూపించుకోవాలి. మన ప్రజాస్వామ్యంలో ప్రధాన లక్షణం కూడా అదే. ఓట్లు అయినా సీట్లు అయినా అదే పరిస్థితి. ఇక్కడే సంకీర్ణ శకానికి నాంది పడింది. రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందు కూటములుగా ఏర్పడటం అయినా.. ఎన్నికల తర్వాత కూటమిగా ఏర్పడినా ఓట్లు కలుపుకోవడమో.. సీట్లు కలుపుకోవడమో చేసి మెజార్టీ సాధించడమే లక్ష్యం. అయితే ఇప్పుడు ఈ సంకీర్ణాలకు గడ్డు పరిస్థితి ఏర్పడింది. డైనమిక్‌గా మారుతున్న రాజకీయాల కారణంగా సంకీర్ణ ప్రభుత్వాలు మనుగడ సాధించే పరిస్థితి లేకుండా పోయింది. 2014 ఎన్నికల ముందు వరకు మూడు దశాబ్దాల పాటు కేంద్రంలో ఏకపార్టీ ప్రభుత్వం లేదు. ఓటర్లు ఏ ఒక్క పార్టీకీ పూర్తి మెజారిటీ కట్టబెట్టలేదు.అప్పుడంతా దేశ రాజకీయాల్లో సంకీర్ణ శకం నడిచింది. అనేక పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వాల మంత్రివర్గంలో విభేదాలు తలెత్తడం, వేడివేడి చర్చలు, సంప్రదింపులు,బుజ్జగింపుల తర్వాత ఏకాభిప్రాయ సాధనతో ప్రధాన మంత్రులు విధాన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. చాలా సార్లు ఈ సంకీర్ణ ప్రభుత్వాలు కుప్పకూలిపోయాయి. అదే సమయంలో రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. చాలా రాష్ట్రాల్లో సంకీర్ణాలు విజయవంతంగా నడిచాయి. ఎక్కడిదాకో ఎందుకు మహారాష్ట్రలోనే బీజేపీ- శివసేన ప్రభుత్వం కూడా విజయవంతంగా నడిచింది.

మూడింట రెండు వంతుల మెజార్టీ వస్తేనే ప్రభుత్వం సాఫీ.. లేకపోతే గ్యారంటీలేదు !

అయితే గత దశాబ్దకాలంగా పరిస్థితి మారిపోయింది. ఏ ఒక్క సంకీర్ణ ప్రభుత్వం … ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మద్దతు లేని సంకీర్ణం మనుగడ సాగించడం లేదు. ఇక్కడ సంకీర్ణాలు మనుగడ సాగించడం సమస్య కాదు. కేంద్ర ప్రభుత్వ మద్దతు లేకపోవడం సమస్య. అంటే కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఏమైనా చేయగలదని అర్థం చేసుకోవచ్చు. అదే కేందరంలో అధికారంలో ఉన్న బీజేపీ ఓ పాలకపక్షంగా ఉన్న సంకీర్ణాలు సాఫీగానే సాగుతున్నాయి. ఈ పరిణామాలతోనే దేశ రాజకీయాల్లో మౌలికమైన మార్పులు వస్తున్నాయి. ఇక్కడ గుర్తు చేసుకోవాల్సింది ఏమిటంటే సంకీర్ణాలే కాదు…అరకొర మెజార్టీ వచ్చినా ప్రభుత్వాలు నిలబడటం కష్టం. థంపింగ్ మెజార్టీ వస్తేనే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా రాజకీయాలు చేయగలరు. లేకపోతే ప్రభుత్వాలు కూలిపోవాల్సిందే.

తప్పు రాజకీయ పార్టీలది కాదు ప్రజాస్వామ్యాన్ని అమ్ముకుంటున్న రాజకీయ నేతలదే !

ఈ రాజకీయ పరిణామాల్లో బీజేపీని రాజకీయ వ్యూహాలను కానీ తప్పు పట్టాల్సిన పని లేదు. అప్పట్లో కాంగ్రెస్ అధికారంలో ఉంటే చేసింది ఇదే. గాంధీల సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలను ఏకపక్షంగా డిసాల్వ్ చేయడం చేలా సార్లు జరిగింది. ఆ ప్రజాస్వామ్య వాడకాన్నే ఇప్పుడు బీజేపీ అందిపుచ్చుకుంది. అందులో సందేహం లేదు. కాకపోతే ఇప్పుడు మరింత విస్తృతం అయింది. అసలు రాజకీయ నేతలు నిబద్ధతతో ఉంటే ఇలాంటి పరిస్థితి రాదు. మహారాష్ట్ర పరిణామాలనే తీసుకుంటే… ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రెండేళ్ల తర్వాత కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి పాలన చేస్తున్నామన్నసంగతి గుర్తించినట్లుగా కొత్త వాదన లెవనెత్తుతున్నారు. ఆయన తిరుగుబాటు చేయాలనుకున్నారు చేస్తున్నారు.. అందరూ అంతే. ఇలాంటి రాజకీయాల కారణంగానే ప్రభుత్వాలు కూలిపోతున్నాయి. వీరంతా ఓ సిద్దాంతానికి కట్టుబడి ఉంటే… ఇలాంటి పరిస్థితులు తలెత్తవు. ఈ పరిస్థితి రావడానికి రాజకీయాల్లో పడిపోతున్న విలువలే కారణం అని అనుకోవచ్చు. రాజకీయ నేతలు తమను ప్రజలు ఎన్నుకున్నారని.. తాము ఏం చేసినా ప్రజల కోసమే చేస్తున్నామని ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించుకుంటున్నారు.

ఈ తరహాలో ప్రజాస్వామ్యాన్ని వాడేస్తే ఏం జరుగుతుందో చెప్పడం కష్టమే !

అయితే ఈ ప్రజాస్వామ్య వాడకంలో ప్రజలే ఎప్పటికీ బాధితులు అవుతున్నారు. రాజకీయ పార్టీలు.. రాజకీయ నేతలు.. డెమెక్రసీని ఇష్టారీతిన ఉపయోగించుకుని .. తమదైన రాజకీయం చేస్తూంటే… ప్రజలు మాత్రం వీటి పాల బడి బాధితులుగా మారుతున్నారు. కర్ణాటకలో ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా ఎవరికి అధికారం కట్టబెట్టారు. ఎవరికీ కట్టబెట్టలేదు. మెజార్టీ ప్రజాస్వామ్యం ప్రకారం.. కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. వాళ్లను పరిపాలన చేయనివ్వాల్సింది. కానీ అలా జరగలేదు. మహారాష్ట్రలో బీజేపీతో కలిసి పోటీ చేసిన శివసేన ముఖ్యమంత్రి పదవి కోసం… ఇతర పార్టీలతో చేతులు కలిపి తాను కూడా ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించుకోగలనని నిరూపించింది. ఇక్కడా ప్రజలే బాధితులయ్యారు. ఎక్కడ చూసినా.. భారత ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. రేపో మాపో మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడవచ్చు. ఆ తర్వాత రాజస్థాన్ వంతు రావొచ్చు. ఆ తర్వాత కేరళ కావొచ్చు.. ఎందుకంటే అక్కడ ఇప్పుడే సీఎంపై సీబీఐ కేసులు పెట్టేందుకు ప్రయత్నాలు కూడా ప్రారంభమయ్యాయి. మన ప్రజాస్వామ్యంలో ఏమైనా జరగవచ్చు. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు ఈ ప్రజాస్వామ్యాన్ని గరిష్ట స్థాయిలో ఉపయోగించుకుంటున్నాయి. కానీ ప్రజలే ఎప్పటికప్పుడు బకరాలవుతున్నారు.

” డెమక్రసీ ఈజ్ నాట్ ద లా ఆఫ్ ద మెజార్టీ బట్ ద ప్రొటెక్షన్ ఆఫ్ మైనారిటీ ” అని ఓ పెద్దాయన చెబుతారు. కానీ ఇక్కడ మైనారిటీని టార్గెట్ చేసి మెజార్టీని ఓటు బ్యాంకులు అది సాధారణ ఓట్లు అయినా… చట్టసభల ఓట్లు అయినా సరే.. చేసుకోవడమే ప్రజాస్వామ్యంగా మారిపోయింది. అంటే మొత్తంగా భారత దేశ ప్రజాస్వామ్యం అందరి కంటే భిన్నమైనదన్నమాట.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close