ఉభయగోదావరి జిల్లాలలో పట్టణాలు చాలా వేగంగా విస్తరిస్తున్నాయి. రాజమండ్రి, కాకినాడ, భీమవరంలతో పాటు ఏలూరులోనూ కాలనీలు పెరుగుతున్నాయి. మౌలిక సదుపాయాలు పెరుగుతున్నాయి. దీంతో సమీప గ్రామాల నుంచి పట్టణాలకు వలస వచ్చే వారు మాత్రమే కాదు.. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు కూడా సొంత ప్రాంతంలో పెట్టుబడి పెట్టడం, ఇల్లు కొనడం అనే కాన్సెప్ట్ ను ఎంచుకుంటుకున్నారు.
ఏలూరు జిల్లా కేంద్రంగా ఏర్పాటు కావడంతో రహదారులు, రవాణా, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి క్రమంగా పెరుగుతోంది. ఇది రియల్ ఎస్టేట్ డిమాండ్ను పెంచుతోంది. ఏలూరు ఇప్పటికీ ప్రధానంగా వ్యవసాయం, వాణిజ్య కేంద్రంగా ఉంది. విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ఇక్కడ ఇళ్ల నిర్మాణం కూడా జోరుగాసాగుతోంది. ఇక్కడ ఎక్కువగా ఇతర ప్రాంతాల్లో సంపాదించి.. పెట్టుబడిగా పెట్టడానికి భూములు, ఇళ్ల స్థలాలు కొంటున్నారు. దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం. ఏలూరు బెటర్ అని భావిస్తున్నారు.
ఏలూరులో యాభై లక్షలకు మంచి విశాలమైన ఇళ్లు అందుబాటులో ఉంటున్నట్లుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఏలూరు శివారు ప్రాంతాల్లో భూమి ధరలు చదరపు గజానికి రూ.10,000 నుంచి రూ.25,000 వరకు ఉందని చెబుతున్నారు. ఇటీవలి కాలంలో ఏలూరు రూపులేఖలు మారిపోతున్నాయి. వచ్చే ఐదేళ్లలో అనూహ్యమైన అభివృద్ధి కనిపించే అవకాశాలు ఉన్నాయి.