కర్ణాటకానికి ఆ విధంగా లాజికల్ ఎండింగ్..!?

కర్ణాటకలో రెబెల్ ఎమ్మెల్యేలు ప్రత్యేక విమానాల్లో.. ముంబై టు బెంగళూరు తిరుగుతూ.. తమ రాజీనామాలకే కట్టుబడి ఉన్నారు. దీంతో.. ఇవాళ కాకపోయినా.. రేపైనా స్పీకర్ వారి రాజీనామాలను ఆమోదించక తప్పదు. ఆ తర్వాత కుమారస్వామి సర్కార్ నిలబడటం అసాధ్యం. దాంతో.. ఇప్పుడు.. ప్రత్యామ్నాయం ఏమిటన్న అంశం.. విపరీతంగా చర్చకు వస్తోంది. కుమారస్వామి ముఖ్యమంత్రిగా దిగిపోయినా.. కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి వస్తారని.. నిన్నటిదాకా అంచనా వేశారు. కాంగ్రెస్, జేడీఎస్ వర్గాలు కూడా అదే చెప్పాయి. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. జేడీఎస్‌తో.. బీజేపీ టచ్‌లోకి వెళ్లిందనే ప్రచారం జరుగుతోంది.

కర్ణాటక వ్యవహారాలను బీజేపీ చాలా సీరియస్‌గా తీసుకుంది. ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటోంది. అయితే.. ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి.. సభలో కావాల్సిన సభ్యుల సంఖ్యను తక్కువ చేసి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా… ఆ తర్వాత ఎమ్మెల్యేలను గెలిపించుకోలేకపోతే… పరువు పోతుంది. ప్రభుత్వం కూడా కుప్పకూలుతుంది. అదే జరిగితే… జాతీయ స్థాయిలో బీజేపీ ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అవుతుంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లుగా చరిత్రలో మిగిలిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత రిస్క్ ఎందుకని… బీజేపీ నేరుగా.. జేడీఎస్‌తో టచ్‌లోకి వెళ్లిందని తెలుస్తోంది. బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు.. బెంగళూరులో మకాం వేసి.. జేడీఎస్ ముఖ్య నేతలతో మంతనాలు జరుపుతున్నారు.

గతంలో బీహార్ లో.. ఆర్జేడీ, జీడీయూ కూటమి ప్రభుత్వాన్ని విచ్చిన్నం చేసి.. జేడీయూతో కలిసి.. బీజేపీ సర్కార్‌ను ఏర్పాటు చేసింది. కర్ణాటకలోనూ అదే తరహాలో కాంగ్రెస్, జేడీఎస్ కూటమిని విచ్చిన్నం చేసి… జేడీఎస్‌తో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటోంది. జేడీఎస్ కలసి వస్తే ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని అంచనా వేస్తోంది. సంఖ్యాబలం రీత్యా.. జేడీఎస్‌కు ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. కుమారస్వామి సోదరుడు.. రేవణ్ణకు ఈ పదవి ఆఫర్ ఇచ్చారు. దీంతో.. జేడీఎస్‌లోనూ.. చర్చ జరుగుతోంది. ఇప్పటికిప్పుడు.. ప్రభుత్వం నిలబడటం కష్టం కాబట్టి.. ఏదో విధంగా.. సంకీర్ణ ప్రభుత్వంలో ఉంటే మంచిది కదా అన్నట్లుగా.. వారి ఆలోచనలు ఉన్నాయని తెలుస్తోంది. ఒకటి, రెండురోజుల్లో… ఈ విధంగా లాజికల్ ఎండింగ్‌కు కర్ణాటకం వచ్చినా ఆశ్చర్యం లేదన్న భావన వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

ఇంకా “బలమైన” భ్రమల్లోనే కేటీఆర్ !

కేటీఆర్ నియోజకవర్గాల వారీ సమీక్ష సమావేశాల్లో రేవంత్ రెడ్డిని తిట్టి... ఎన్నికల్లో దున్నిపారేస్తామని ప్రసంగించి వెళ్లిపోతున్నారు. గ్రౌండ్ లెవల్లో పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడం లేదు. కనీసం ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close