మరోసారి ఈటలతో కాంగ్రెస్ లోపాయికారీ రాజకీయం !

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఎలాగైనా షాకివ్వాలనుకుంటున్న ఈటల రాజేందర్ ప్రయత్నాలకు కాంగ్రెస్ సాయం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తున్న కాంగ్రెస్ ఏకగ్రీవం కాగా మిగిలిన చోట్ల ఇండిపెండెంట్లకు చాన్సివ్వాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఖమ్మం, మెదక్‌ జిల్లాల్లో మాత్రమే టీఆర్ఎస్ అభ్యర్థులు ఉన్నారు. ఆదిలాబాద్, నల్లగొండ, కరీంనగర్‌లోని రెండు స్థానాల్లో పోటీ జరుగుతోంది.అక్కడ ఇండిపెండెంట్లు బరిలో ఉన్నారు.

అన్ని జిల్లాల్లో పార్టీ తరఫున స్థానిక ప్రజాప్రతి నిధులు ఉన్నందున వారిని కాపాడుకునేందుకు ఎవరికైనా మద్దతివ్వాలన్న ఆలోచన చేస్తున్నారు. ఆదిలాబాద్‌లో ఆదివాసీ నేతగా బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థిని పుష్పారాణికి అధికారికంగానే కాంగ్రెస్‌ మద్దతిస్తోంది. కరీంనగర్‌లో తనకు మద్దతివ్వాలని మాజీ మేయర్ రవీందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీ నేతల చుట్టూ తిరుగుతున్నారు. ఆయనకు ఈటల రాజేందర్ మద్దతు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈటల వర్గీయులు.. కాంగ్రె్స్ గకలిసి ఆయను గెలిపించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.

అయితే నల్లగొండలో స్వతంత్రులకు మద్దతివ్వడం పార్టీకి ఇబ్బందిగా మారుతోంది. బరిలో ఉన్న ఆరుగురు స్వతంత్రుల్లో ఇద్దరు కాంగ్రెస్‌ జెడ్పీటీసీలే ఉన్నారు. నిర్ణయాన్ని కోమటిరెడ్డికి వదిలేశారు. ఎన్నికలు జరిగే నాటికి ప్రతి చోటా ఒక అభ్యర్థికి పార్టీ పక్షాన మద్దతు ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. తాము పోటీ చేస్తున్న చోట అయినా.. లేకపోతే ఇండిపెండెంట్లకు మద్దతు ఇచ్చి అయినా ఒకటి రెండు చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థుల్ని ఓడించాలన్న పట్టుదలతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. నిజానికి అన్ని చోట్లా టీఆర్ఎస్‌కు స్పష్టమైన మెజార్టీ ఉంది. ఎక్కడైనా ఓడిపోయిందటే.. జారిపోతున్న ఆ పార్టీ పట్టుకు నిదర్శనంగా మారుతుంది. అందుకే కాంగ్రెస్ ఈ సారి ఈటల తరహాలోనే ఆలోచిస్తేంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close