మీడియా వాచ్ : “ఈనాడు ఓన్లీ డిజిటల్‌”లో వాస్తవం ఎంత..?

ఈనాడు దినపత్రిక ప్రచురణను నిలిపివేయబోతోందని కొద్ది రోజులుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. రామోజీరావుకు అత్యంత ఇష్టం అయిన చతుర, విపుల, తెలుగువెలుగు, బాలభారతం వంటి వాటిని ఆన్ లైన్ ఎడిషన్లు కూడా క్లోజ్ చేయడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. పత్రిక ప్రింటింగ్ నిలిపివేసి ఇక ఆన్‌లైన్‌కు మాత్రమే పరిమితమవుతారని.. రామోజీ గ్రూప్ ఫార్మా రంగంలోకి వెళ్తుందన్న ప్రచారం కూడా చేస్తున్నారు. రామోజీ గ్రూప్ తదుపరి ఏ రంగంలోకి వెళ్తుందన్నది తర్వాత విషయం కానీ.. అసలు ఈనాడుపై ఈ రకమైన ప్రచారం జరగడానికి అంతర్గతంగా జరుగుతున్న చర్చలే కారణం అని చెబుతున్నారు.

వ్యాపారం అంటే పదేళ్ల ముందు పరిస్థితుల్ని అర్థం చేసుకుని దానికితగ్గట్లుగా వ్యాపారాన్ని మార్చుకోవాలన్నది రామోజీ గ్రూప్ సిద్ధాంతం. లేకపోతే మనుగడ ఉండదు. టెక్నాలజీ వేగంగా మారిపోతున్న కాలంలో మరింత ఆధునికంగా వ్యవహరించాలన్నది వారి ఉద్దేశం. ఆ ప్రకారం.. ముందు ముందు పరిస్థితుల్ని విశ్లేషించుకున్న రామోజీ గ్రూప్ పెద్దలు.. ప్రింటింగ్ ఎడిషన్‌కు ఆదరణ పెరగడం సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు. ఓ వైపు న్యూస్ ప్రింట్ ధర పెరగడం.. రంగులు సలహా ప్రతీది ఖర్చు పెరిగిపోవడంతో ఇప్పటికే… ఆదాయం కరిగిపోతోంది. ఇక ఎలా చూసినా… పత్రికను చేతుల్లోకి తీసుకుని చదివే పాఠకుల సంఖ్య పెరగదని… ఫోన్లలో… ట్యాబుల్లో మాత్రమే చూసే వారి సంఖ్య పెరుగుతుందని అంచనాకు వచ్చారు. దాని ప్రకారమే.. తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు.

వచ్చే మూడేళ్లలో మెల్లగా ప్రింట్ ఎడిషన్‌కు తగ్గిపోయే ఆదరణను బట్టి… మౌలిక సదుపాయాలు కూడా తగ్గించుకోవాలని నిర్ణయించారు.ఇప్పటికే కొన్ని చోట్ల.., ప్రింటింగ్‌ను ఔట్ సోర్సింగ్ కు ఇచ్చారు. మిగతా చోట్ల కూడా ఇవ్వాలని అనుకుంటున్నారు. ఇటీవల జర్నలిజం స్కూల్‌లో కూడా… ప్రింట్‌ కోసం నియామకాలు చేయడం లేదు. డిజిటల్ కోసం మాత్రమే నియామకాలు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితులన్నింటినీ విశ్లేషిస్తే.. ఈనాడు.. భవిష్యత్ టెక్నాలజీని ఊహించి… ఉనికి కాపాడుకోవడానికి ఇప్పటి నుండే మార్పుల కోసం ముందడుగు వేస్తున్నట్లుగా భావిస్తున్నారు. లేకపోతే… స్మార్ట్ శకాన్ని గుర్తించడానికి సిద్ధపడని… ఫోన్ల కంపెనీ నోకియాలా మారిపోతుందని నిర్ణయానికి వచ్చారు.

అయితే ఈ పరిస్థితి ఒక్క ఈనాడుదే కాదు. అన్ని దినపత్రికలు.. తమ ప్రింటింగ్ విభాగాన్ని మూసేసుకోవాల్సిన పరిస్థితి వచ్చే మూడేళ్లలో రావొచ్చు. ఆయా కంపెనీలు కూడా దానికి తగ్గట్లుగా మెరుగైన ఏర్పాట్లు చేసుకోకపోతే.. ఇబ్బంది పడతారనేది.. న్యూస్ పేపర్ ఇండస్ట్రీ వర్గాల అంచనా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close