అమరావతిలో భూకంపం ప్రచారం..! ఇక వైసీపీని నమ్ముతారా..?

అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేస్తామని …రూ. మూడు వేల కోట్ల రుణం తీసుకోవడానికి గ్యారంటీ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత వైసీపీ నేతలు.. అమరావతిపై తమకు ఎంతో ప్రేమ ఉందని ప్రకటనలు చేశారు. ఎంత అనుమానం ఉన్నా.. అధికార పార్టీ చేస్తుందేమో అన్న ఆశ కొంత మందిలో కలిగింది. గుంటూరు, కృష్ణా కార్పొరేషన్ ఎన్నికల్లో గెలవడానికి ఈ స్కెచ్ వేశారని..కట్టరు..కట్టబోరని విపక్షాలు చెబుతున్నాయి. ఎవరి వాదనలు ఎలా ఉన్నా… హఠాత్తుగా శనివారం అమరావతిలో భూకంపం అంటూ.. జగన్ మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది. వైసీపీ సోషల్ మీడియా స్పాన్సర్డ్ పోస్టులతో హోరెత్తించింది. ఇక ఏ మీడియా కూడా అక్కడ భూకంపం.. భూప్రకంపనలు అనే అంశాలను పట్టించుకోలేదు.

అసలు ఈ భూకంపం ఎక్కడి నుంచి వచ్చిందా అని ఆరా తీస్తే.. రాజధాని గ్రామాలకు అవతల కర్లపూడి అనేగ్రామంలో మైనింగ్ బ్లాస్టింగ్ వల్ల ఏర్పడిన కంపం అని తేలంది. కొంత మంది వైసీపీ నేతలు అనుమతులేమీ లేకుండా పెద్ద ఎత్తున జిలెటిన్ స్టిక్స్‌తో పేలుళ్లు జరుపుతున్నారు. అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో వారు చెలరేగిపోతున్నారు. ఈ క్రమంలో మైనింగ్ కోసం చేశాలో లేకపోతే.. అమరావతి భూకంపం అని ప్రచారం చేయడానికి చేశారో కానీ.. ఒక్క సారే జిలెటిన్ స్టిక్స్ పెద్ద ఎత్తున పేల్చారు. దీంతో అక్కడ పెద్దగొయ్యి ఏర్పడింది. పేలుడు జరిగిన కాసేపటికే.. జగన్ మీడియాలో అమరావతిలో భూకంపం అంటూ ప్రచారం ప్రారంభమయింది.దీన్ని చూసి అమరావతి ప్రాంత వాసులు ముక్కున వేలేసుకోవాల్సి వచ్చింది.తమ ప్రాంతం ఇంత పెద్ద కుట్ర చేస్తున్నారా.. అని ఆశ్చర్యపోయారు.

నిజానికి అలాంటిపేలుడు జరిగితే బాధ్యతుల్ని తక్షణం అరెస్ట్ చేయాలి. కానీపోలీసులు కేసు కూడా నమోదు చేయలేదని అమరావతి రైతులు అంటున్నారు. మొత్తానికి అమరావతిని కట్టేస్తామంటూ ప్రకటనలు చేసి.. ఏదో విధంగా పాజిటివ్ నెస్ తెచ్చుకుందామనుకున్న అధికార పార్టీ… అమరావతిపై తప్పుడు ప్రచారం చేసే చాన్స్ వస్తే వదులుకోబోమని తేల్చేసి… ప్రజల్లో ఏర్పడిన పాజిటివ్ అనుమానాలను పటాపంచలు చేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close