జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దోచిపెట్టిన ప్రజాధనం ఇంకా పవర్ చూపిస్తుందేమో కానీ.. ఎన్టీవీ మాత్రం తన కృతజ్ఞతను కక్కేస్తోంది. తెలుగుదేశం పార్టీపై, జనసేనపై గతంలో చేసిన విష ప్రచారాలపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఇప్పుడు మెల్లగా మళ్లీ ప్రారంభిస్తున్నారు. దేవినేని ఉమ వైసీపీలోకి వెళ్తారంటూ ఓ కథనాన్ని పుకార్ల రూపంలో వండి వార్చారు.
పనికి మాలిన సోషల్ మీడియా ఖాతాల్లో కొన్నింటిలో ఈ ప్రచారం చేశారు. దానికి దేవినేని ఉమ చెప్పుతో కొట్టినట్లుగా సోషల్ మీడియాలోనే సమాధానమిచ్చారు. అయినా ఎన్టీవీ ఉద్దేశపూర్వకంగా మళ్లీ.. అలా అనుకుంటున్నారు.. ఇలా అనుకుంటున్నారు అని కథనం వండేసింది. ఎన్టీవీ లక్ష్యం దేవినేని ఉమపై టీడీపీలో అనుమానాలు రేపడం. ఇలా ప్రారంభించి .. ఒక్కొక్కరిపై .. వైసీపీకి కావాల్సిన వారిపై పుకార్లు రేపి.. తమ పబ్బం గడుపుకోవడం. ఇదంతా సజ్జల స్క్రిప్ట్. దాన్ని ఎన్టీవీ అమలు చేస్తోంది.
దేవినేని ఉమ.. తాను చంద్రబాబు కుటుంబసభ్యుడినని చెబుతారు. పదవులకు అతీతమైన బంధం ఆయనది. రాజకీయ పరిస్థితుల వల్ల కొన్ని సార్లు అవకాశం కల్పించలేకపోవచ్చు కానీ.. జగన్ రెడ్డిలా.. బలి పశువుల్ని చేసే సంస్కృతి టీడీపీలో ఉండదు. ఆ విషయం రాజకీయాల్లో ఉన్న అందరికీ తెలుసు. దేవినేని ఉమా క్లారిటీ ఇచ్చినా ఎన్టీవీ ఇలాంటి ప్రచారం చేయగలుగుతుందంటే.. టీడీపీ అంటే అలుసుగా తీసుకుంటున్నారని అర్థం అనుకోవచ్చు.