స్పందించిన హరీష్.. ఈటలకు కౌంటర్..!

టీఆర్ఎస్ పార్టీలో తన కంటే ఎక్కువగా అవమానాల పాలయింది హరీష్ రావేనంటూ.. ఈటల చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీనిపై హరీష్ రావు స్పందించడం లేదంటే నిజమేనని.. నిన్న ఉదయం ఈటల ప్రెస్‌మీట్ పూర్తయినప్పటి నుండి ప్రచారం జరిగింది. అయితే.. పార్టీ హైకమాండ్ నుంచి స్పందించాలని ఎలాంటి సందేశం రాకపోవడంతో హరీష్ సైలెంట్ అయిపోయారు. సోషల్ మీడియాలో కూడా.. ఈటల వ్యాఖ్యల టెంపో పెరిగిపోతూండటంతో వివరణ ఇవ్వాలని హరీష్‌కు హైకమాండ్‌ నుంచి సందేశం వచ్చింది. దాంతో.. హరీష్ రావు ప్రకటన విడుదల చేశారు.

పార్టీ నాయకుడిగా కేసీఆర్ ఏ ఆదేశం ఇచ్చినా నడుచుకుంటానని హరీష్ ప్రకటించారు. గతంలోనూ అదే చెప్పానన్నారు. ఇప్పుడూ అదే చెబుతున్నానన్నారు. ఈటల చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. తాచెడ్డ కోతి.. వనమెల్లా చెరిచినట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. పార్టీలో ఉండాలా.. వెళ్లిపోవాలా అనేది ఆయన ఇష్టమని.. సమస్యలకు, గొడవలకు నైతిక బలం కోసం పదే పదే తన పేరును ప్రస్తావించడం మంచిది కాదన్నారు. తన భుజాల మీద తుపాకి పెట్టాలనుకోవడం విఫలయత్నం అవుతుందన్నారు. తన గురించి ఈటల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని హరీష్ స్పష్టం చేశారు.

హరీష్ రావుకు తన కంటే ఎక్కువ ఇబ్బందులు కల్గించారని ఈటల గతంలోనూ అన్నారు. శుక్రవారం కూడా అన్నారు. వీటికి చెక్ పెట్టకపోతే.. మళ్లీ మళ్లీ హరీష్ గురించి చెబుతూనే ఉంటారని అనుకున్నారు. అందుకే.. హరీష్ స్పందించిన ప్రకటన రిలీజ్ చేసినట్లుగా భావిస్తున్నారు. అయితే టీఆర్ఎస్‌లో హరీష్ రావుకు ఎదురైన పరిస్థితులు అందరికీ తెలుసు. ఈ కారణంగా.. ఆయన తనకు అవమానాలు ఎదురవలేదని నేరుగా ప్రకటించినా.. చాలా మంది నమ్మరు. అందుకే ప్రకటన విడుదల చేసినట్లుగా తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close