ముగ్గురు ఎన్టీఆర్‌లు.. ఐదుగురు హీరోయిన్లు

జై ల‌వ‌కుశ‌లో ఎన్టీఆర్ తొలి సారి త్రిపాత్రాభినయం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ముగ్గురు ఎన్టీఆర్‌లు కాబ‌ట్టి ముగ్గురు హీరోయిన్లు ఉండాల్సిందే అనేది లెక్క‌. అయితే ముగ్గురు కాదు… ఈ సినిమాలో మొత్తం న‌లుగురు హీరోయిన్లు ఉన్నారు. ఇప్ప‌టికే ఓ క‌థానాయిక‌గా రాశీఖ‌న్నాని తీసుకొన్నారు. రెండో క‌థానాయిక ఛాన్స్ నివేదా ధామ‌స్ కి ద‌క్కింది. పొడుగు కాళ్ల సుంద‌రి హంసానందిని మ‌రో క‌థానాయిక‌గా క‌నిపించ‌నుంద‌ట‌. వీళ్ల‌తో పాటు ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ ఫేమ్ నందిత ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ద‌ని తెలుస్తోంది. నందిత‌ది చిన్న పాత్రే అని.. గెస్ట్ అప్పీరియ‌న్స్ అని స‌మాచారం. అంతే కాదు.. ఓ ప్ర‌త్యేక గీతంలో మ‌రో క‌థానాయిక మెర‌వ‌బోతోంద‌ట‌. అంటే… ముగ్గురు ఎన్టీఆర్‌ల‌కు ఐదుగురు హీరోయిన్ల‌న్న‌మాట‌.

అన్న‌ట్టు ఈ సినిమాలో స‌మంత‌ని క‌థానాయిక‌గా ఎంచుకొన్నార‌న్న ప్ర‌చారం జోరుగా సాగింది. కొంద‌రైతే… స‌మంత‌ది ఇందులో నెగిటీవ్ ట‌చ్ ఉన్న పాత్ర అని, ఎన్టీఆర్‌తో ఓ ఆట ఆడేసుకొంటుంద‌ని కూడా రాశారు. అయితే అదంతా తూచ్ అని తెలుస్తోంది. ఈసినిమాలో అస‌లు స‌మంత‌నే లేద‌ని, ఆమెను ఎవ్వ‌రూ సంప్ర‌దించ‌లేద‌ని `జై ల‌వ‌కుశ‌` టీమ్ చెబుతోంది. సో.. ఎన్టీఆర్ – స‌మంత కాంబోని `జై ల‌వ‌కుశ‌`లో చూసే అవ‌కాశం లేద‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close