యూపిలో ద్రౌపదీ వస్త్రాపహరణం పోస్టర్ల కలకలం

రాజకీయ నేతలు కొన్నిసార్లు నోరు జారడం, తరువాత ఉపసంహరణలు, క్షమాపణలు చెప్పుకొని బయటపడటం చూస్తూనే ఉంటాము. అలాగే ధోనీ వంటి ప్రముఖులు దేవతామూర్తుల రూపంలో పోస్టర్లకి, పత్రికలకి ఎక్కి తలబొప్పి కట్టించుకోవడం కూడా అపుడప్పుడు చూస్తూనే ఉంటాము. ఉత్తరప్రదేశ్ లో అటువంటిదే పునరావృతం అయింది.

ఆ రాష్ట్రానికి ఇటీవలే కేశవ్ మౌర్యా భాజపా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. వారణాసికి చెందిన రూపేష్ పాండే అనే భాజపా నేత ఒకరు తమ కొత్త నాయకుడిని స్వాగతిస్తూ ఏర్పాటు చేసిన ఒక ఫ్లెక్సీ బ్యానర్ వివాదాస్పదమయింది. అందులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని ద్రౌపదిగా చిత్రీకరించి, రాహుల్ గాంధి, రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, మంత్రి అజాం ఖాన్, మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ, ప్రతిపక్ష నేత మాయావతి ఐదుగురినీ దుశ్శాసనులుగా చూపించి, వారు ఐదుగురు కలిసి ద్రౌపదీ వస్త్రాపహరణం చేస్తున్నట్లు పోస్టర్లో చూపించారు.

వారి బారి నుండి ద్రౌపది (ఉత్తరప్రదేశ్)ని కాపాడటానికే వచ్చిన శ్రీకృష్ణుడు కేశవ్ మౌర్యా అన్నట్లు ఆ పోస్టర్ లో చిత్రీకరించారు. విష్ణుచక్రం ధరించి శ్రీకృష్ణావతారంలో ఉన్న కేశవ్ మౌర్యాని ఉద్దేశ్యించి “రక్షమామ్ కేశ్” అంటూ ద్రౌపది మొరపెట్టుకొంటున్నట్లు చిత్రీకరించారు.

వారణాసిలో కొన్ని ప్రధాన కూడళ్ళలో ప్రత్యక్షమయిన ఈ పోస్టర్ చాలా కలకలం రేపుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కినందుకు ఎంతో సంతోషిస్తూ భాద్యతలు స్వీకరిస్తే మొట్టమొదటిరోజే కేశవ్ మౌర్యాకి చేదు అనుభవం ఎదురవడంతో కంగు తిన్నారు. వెంటనే తేరుకొని ఆ పోస్టర్లతో తనకు ఎటువంటి సంబంధమూ లేదని ప్రకటించేసి చేతులు దులుపుకొన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close