వల్లభనేని వంశీ కుటుంబంలో జగన్ మార్క్ చిచ్చు పెట్టేందుకు రెడీ అయ్యారు. గన్నవరం ఇంచార్జ్ గా వంశీ స్థానంలో ఆయన భార్యను నియమిస్తామని ప్రచారం ప్రారంభించారు. వంశీ భార్య పంకజశ్రీకి ఇంచార్జ్ గా ఇస్తారని వైసీపీ వర్గాలు లీక్ చేశాయి. వల్లభనేని వంశీ కేసుల్లో ఇరుక్కున్నందున ఆయన బయట తిరగడం కష్టమని ఆయనకు అన్యాయం జరగకుండా.. ఆయన భార్యకు ఇంచార్జ్ పోస్టు ఇస్తామని చెబుతున్నట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికే కొన్ని కుటుంబాల్లో ఇలాగే జగన్ చిచ్చు పెట్టేశారు. దువ్వాడ శీను కుటుంబం నాశనం అయిపోయింది. నందిగం సురేష్ భార్యకూ అలాంటి సంకేతాలే ఇచ్చారు.. ఆమె హోంమినిస్టర్ అనే లెక్కల్లో ఉన్నారు. మరికొంత మంది కుటుంబాల విషయంలో ఇలాగే జగన్ వ్యవహరిస్తున్నారు. తన భార్యను రాజకీయాల్లోకి తేవడం వంశీకి ఇష్టం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇద్దరి మధ్య అంత సఖ్యత లేదని ..గతంలో ఆమె కేసు పెట్టారన్న ప్రచారం కూడా ఉంది.
వంశీకి ఇప్పుడు దాదాపు అన్ని కేసుల్లో బెయిల్ లభించింది. ఒక్క కేసులో మాత్రమే పెండింగ్ ఉంది. ఇంకా పీటీ వారెంట్లు వేసే అవకాశం లేదు. ఇప్పటికే నాలుగు నెలలు అవుతున్నందున.. ఆయన బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయనను ఇంచార్జ్ గా తప్పించి ఆయన భార్యకు చాన్స్ ఇస్తామని చెప్పడం కుట్రేనని ఆయన వర్గీయులు భావిస్తున్నారు. ఇలా ప్రచారం చేసి చివరికి దుట్టా కుటుంబానికి చాన్స్ ఇస్తారని కూడా అనుమానిస్తున్నారు.