గ‌రిక‌పాటి కంట‌త‌డిలో టీటీడీపీ ద‌య‌నీయ ప‌రిస్థితి!

ఏ నాయకుడైనా పార్టీ మారిన వెంట‌నే ఏం చేస్తారు… గ‌తంలో కొన‌సాగిన పార్టీ మీద విమ‌ర్శ‌లు చేస్తారు, పార్టీ అధినాయ‌కుడిపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తారు, త‌న‌ని ప్రాధాన్య‌త ఇవ్వ‌లేద‌ని అంటారు. కానీ, గ‌రిక‌పాటి మోహ‌‌న్ రావు భాజ‌పాలో చేరుతున్న సంద‌ర్భంగా మాట్లాడుతూ భావోద్వేగానికి లోన‌య్యారు. తెలుగుదేశం పార్టీని వ‌దిలి వెళ్లాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌నే ఆవేద‌న ఆయ‌న‌లో ఎక్కువ‌గా క‌నిపించింది. తెలంగాణ‌లో టీడీపీ ద‌య‌నీత‌ ఆయ‌న మాట‌ల్లో మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది.

తెలుగుదేశం పార్టీ నుంచి బ‌య‌ట‌కి వ‌చ్చేస్తున్నందుకు చాలా బాధ‌గా ఉందంటూ కంట‌త‌డిపెట్టుకున్నారు గ‌రిక‌పాటి. తెలంగాణ‌లో పార్టీని ఉంచాలా ర‌ద్దు చెయ్యాలా అనే ప‌రిస్థితి వ‌చ్చింద‌నీ, గ‌త ఎన్నిక‌ల్లో కేవ‌లం 13 సీట్లు పోటీ చేయాల్సిన ప‌రిస్థితికి ప‌డిపోవ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. బ‌ల‌మున్నా కూడా పోటీకి దూరంగా ఉండాల్సి వ‌చ్చింద‌న్నారు. మ‌న‌సు చంపుకుని భాజ‌పాలో చేరుతున్నాన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అయితే, తాను చంద్ర‌బాబు నాయుడు తీరుని ఎప్పుడూ త‌ప్పుబ‌ట్టడం లేద‌నీ, పార్టీని స‌మూలంగా నాశ‌నం చేయాల‌నుకునేవారు కొంత‌మంది ఉన్నార‌ని ఆరోపించారు. టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు త‌న‌కు ఏ ప‌ద‌వీ రాలేద‌నీ, పార్టీ కోసం చాలా పోరాటాలు చేశాన‌నీ, క‌ష్ట‌కాలంలో పార్టీ వెంట ఉన్నాన‌ని గ‌రిక‌పాటి చెప్పుకొచ్చారు. ఆయ‌తోపాటు భాజ‌పాలో చేరిన పాల్వాయి ర‌జ‌నీ కుమారి, బండ్రు శోభారాణీ కూడా ఇలాంటి బాధ‌నే వ్య‌క్తం చేశారు.

ఇప్పుడు టీటీడీపీలో నాయ‌కులంటే ఇద్ద‌రే క‌నిపిస్తున్న ప‌రిస్థితి. నిజానికి, తెలంగాణ‌పై పార్టీ నాయ‌క‌త్వం మ‌రింత శ్ర‌ద్ధ పెట్టి ఉంటే ఈ ప‌రిస్థితి ఉండేది కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే, పార్టీని ఇంత‌గా ప్రేమించే నాయ‌కులున్న‌ప్పుడు… ఇలాంటి స‌మ‌యంలోనైనా వారికి ప్రాధాన్య‌త ఇచ్చి, కీల‌క బాధ్య‌త‌లు ఇచ్చి ప్రోత్స‌హించి ఉంటే పార్టీ ఉనికి నిల‌బ‌డేది. కానీ, ఏపీలో ఓట‌మి త‌రువాత తెలంగాణ‌లో పార్టీ శాఖ మీద పూర్తి స్థాయిలో చంద్ర‌బాబు నాయుడు దృష్టి పెట్ట‌లేని ప‌రిస్థితి ఉంది. తెలంగాణ‌లో పార్టీ త‌ర‌ఫున క‌నీసం నెల‌కో ప్రెస్ మీట్ అయినా, అడ‌పాద‌డ‌పా స‌భ‌లైనా నిర్వ‌హించి ఉంటే ఉనికి నిల‌బ‌డేది. ఇప్ప‌టికీ పార్టీ మీద అభిమానంతో ఉన్న కార్య‌క‌ర్త‌ల‌కు బాస‌ట‌గా ఉండేది. కానీ, ఆ ప్ర‌య‌త్న‌మేదీ అధినాయ‌క‌త్వం నుంచి క‌నిపించిన‌ప్పుడు ఏమౌతుంది… ఎంత‌టి అభిమానులైనా ఇదిగో ఇలానే కంట‌త‌డిపెట్టి బ‌య‌ట‌కి వెళ్ల‌క త‌ప్ప‌దు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close