పాకిస్తాన్ గీత కధ ఇంకా ఎప్పుడు సుఖాంతం అవుతుందో ఏమో?

సల్మాన్ నటించిన బజరంగీ భాయ్ జాన్ సినిమాలో కధ సుఖాంతం అయింది అలాగే వినూత్నమయిన కధతో తీసిన ఆ సినిమా సూపర్ హిట్ అయి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. కానీ ఆ సినిమా కారణంగా వెలుగులోకి వచ్చిన గీత కధ మాత్రం ఇంకా తెలుగు టీవీ సీరియల్ లాగే అంతులేకుండా సాగిపోతోంది. పాకిస్తాన్ నుండి భారత్ తిరిగి తీసుకువచ్చిన తరువాత ఆమె తన తల్లితండ్రులను గుర్తించలేకపోవడంతో, భారత ప్రభుత్వం ఆమెను మధ్యప్రదేశ్ లోని ఇండోర్ పట్టణంలో గల మూగ చెవుడు బాలబాలికలు ఉండే హాస్టల్లో ఆమెను ఉంచి, అప్పటి నుండి ఆమె అసలయిన తల్లి తండ్రుల కోసం అన్వేషణ మొదలుపెట్టింది. ఆమె తల్లితండ్రులమని చెపుతూ వచ్చిన చాలా మందికి డి.ఎన్.ఏ. పరీక్షలు నిర్వహించారు. ఇంకా నిర్వహిస్తూనే ఉన్నారు. కానీ వారిలో ఏ ఒక్కరివి గీత డి.ఎన్.ఏ. సరిపోలక పోవడంతో ఆమె నేటికీ ఇండోర్ హాస్టల్లోనే భారంగా రోజులు గడుపుతోంది.

విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సోమవారం ఇండోర్ వెళ్లి ఆమెను కలిసి దైర్యం చెప్పబోతున్నారు. ఆమెను తిరిగి ఆమె అసలయిన తల్లి తండ్రుల వద్దకు చేర్చే వరకు తమ అన్వేషణ కొనసాగుతుందని అంతవరకు ఆమెకు ఎటువంటి కష్టం, లోపం కలగకుండా జాగ్రత్తగా చూసుకొంతమని ఆమె అన్నారు. తమ ప్రభుత్వం ఆమెను ఆమె తల్లి తండ్రుల చెంతకు చేర్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోందని, త్వరలోనే ఏదో ఒకరోజు ఆమె అసలయిన తల్లి తండ్రులను గుర్తించి ఆమెను వారికి అప్పగిస్తామని సుష్మా స్వరాజ్ అన్నారు. మానవీయ కోణంలో చూడవలసిన సున్నితమయిన ఈ సమస్యను కొన్ని రాజకీయపార్టీలు రాజకీయం చేయడాన్ని ఆమె తప్పు పట్టారు.

పుట్టుకతోనే మూగ, చెవుడు ఉన్న గీత సుమారు 15 ఏళ్ల క్రితం పొరపాటున పాకిస్తాన్ లోకి ప్రవేశించినపుడు ఆమెను స్థానిక ఈద్ ఫౌండేషన్ సంస్థ వారు చేరదీసి ఇన్నాళ్ళు సంరక్షించారు. సరిగ్గా ఆమె జీవిత కధను ప్రతిబింబించే బజరంగీ భాయ్ జాన్ సినిమా విడుదలయిన తరువాత, ఆమె ఉనికి ప్రపంచానికి తెలిసింది. అప్పుడు బిహార్ లో ఒక కుటుంబం ఆమెను ఏనాడో తప్పిపోయిన తమ కుమార్తెగా గుర్తించారు. అలాగే మరి కొంత మంది దంపతులు కూడా ఆమె తమ కుమార్తెనని భావిస్తూ తమ ఫోటోలను, వివరాలను భారత విదేశాంగ శాఖకు అందజేశారు. అధికారులు వారందరి ఫోటోలను ఇస్లామాబాద్ పంపినపుడు, వారిలో బిహార్ కు చెందిన జనార్ధన్ అనే వ్యక్తిని తన తండ్రిగా గీత గుర్తించడంతో ఆమెను ఈద్ ఫౌండేషన్ ప్రతినిధులు భారత్ కి తోడ్కొని వచ్చేరు. భారత్ విదేశాంగ శాఖ అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి, ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశపరిచారు. కృతజ్ఞతా పూర్వకంగా వారికి మోడీ కోటి రూపాయలు విరాళం ఇవ్వగా దానిని వారు సున్నితంగా తిరస్కరించారు. మోడీ కూడా ఆమెను పూర్తి భరోసా కల్పించారు. అందుకు గీత చాలా సంతోష పడింది. కానీ ఇంతవరకు ఆమె అసలయిన తల్లితండ్రులెవరో గుర్తించలేకపోవడంతో ఆమె నేటికీ ఇండోర్ హాస్టల్లోనే భారంగా రోజులు గడుపుతోంది. ఆమె కధ ఇంకా ఎప్పుడు సుఖాంతం అవుతుందో ఏమో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close