జర్నలిస్టు సాయికి తెలంగాణ సర్కార్ వార్నింగ్ !

యూబ్యూట్ చానల్ పెట్టుకుని వ్యూస్ కోసం అడ్డగోలుగా అబద్దాలు చెబుతూ వీడియోలు చేసే… జర్నలిస్టు సాయికి తెలంగాణ ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. తప్పుడు ప్రచారాలు చేయవద్దని అధికారికంగానే హెచ్చరికలు జారీ చేసింది. అసలేమయిందంటే.. తెలంగాణలో కేసీార్ ప్రారంభించిన మెడికల్ కాలేజీలు అన్నీ కేంద్రం ఇచ్చినవేనని జర్నలిస్ట్ సాయి అనే వ్యక్తి యూట్యూబ్‌లో వీడియో పెట్టారు. అసలు కేంద్రం వాటిని ఇచ్చిందని. బీజేపీకి క్రెడిట్ ఇచ్చారు.

దీంతో తెలంగాణ సర్కార్‌కు మండిపోయింది. జర్నలిస్ట్ సాయి తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపింది. ఆ వీడియోలో మెడికల్ కాలేజీలను కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించినట్లుగా చెప్పారని.. కానీ ఒక్క పైసా కూడా కేంద్రం ఇవ్వలేదని.. పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ నిధులతోనే నిర్మించినట్లుగా ఫ్యాక్ట్ చెక్ తెలిపింది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం, తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీని కూడా కేటాయించలేదు. అయినప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు 12 మెడికల్ కాలేజీలు స్వంత నిధులతో ఏర్పాటు చేసింది. వీటికి కేంద్రప్రభుత్వం ఏలాంటి నిధులు మంజూరు చేయలేదని డాక్యుమెంట్లను ఫ్యాక్ట్ చెక్ విడుదల చేసింది.

తెలంగాణలో 8 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఏమీ లేనప్పటికీ, కేవలం అనుమతులు మంజూరు చేయడాన్ని, కేంద్ర ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినట్టు అర్థం వచ్చేలా తప్పుదోవ పట్టించే విధంగా వీడియోలు చేయవద్దని జర్నలిస్ట్ సాయికి ఫ్యాక్ట్ చెక్ సూచించింది. ఏపీలోనూ ఈ జర్నలిస్ట్ సాయి నిర్వాకాలు అన్నీ ఇన్నీ కావు. ప్రముఖ జర్నలిస్టుగా చెలామణి ఫేక్ న్యూస్ ప్రచారం చేయడంలో రాటుదేలిపోయారు. ఎంతగా నిజాలు చెప్పినా.. కనీసం వివరణ ఇవ్వకపోవడం.. ఈ బరితెగింపు జర్నలిస్టు లక్షణం అన్న విమర్శలున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close