జి.హెచ్.ఎం.సి.కమీషనర్ సోమేశ్ పై బదిలీ వేటు

తెలంగాణాలో 22 మంది ఐ.ఏ.ఎస్‌. అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసారు. ప్రభుత్వాలు ఐ.ఏ.ఎస్. అధికారులను బదిలీ చేయడం సర్వసాధారణ విషయమే. అయితే నిన్న బదిలీ అయిన అధికారులలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేశ్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ స్పెషల్‌ కమిషనర్లుగా వ్యవహరిస్తున్న నవీన్‌ మిట్టల్‌, జి.కిషన్‌లను కూడా ఉండటమే విశేషం.

జి.హెచ్.ఎం.సి.పరిధిలో పెరిగిన జనాభాకి అనుగుణంగా డివిజన్లను పునర్విభజన చేయాలంటూ తెలంగాణా ప్రభుత్వం ఇంతవరకు జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు వాయిదా వేస్తూ కాలక్షేపం చేస్తోంది. సుమారు 11 నెలలు గడిచినా సోమేశ్ కుమార్ ఆ ప్రక్రియను పూర్తి చేయలేకపోయారు. పైగా అది సాధ్యం కాదని ప్రభుత్వానికి లేఖ వ్రాయడంతో ప్రభుత్వం పునర్విభజన ప్రక్రియను అర్ధాంతరంగా నిలిపివేయవలసి వచ్చింది. ఆ కారణంగా ప్రజలకు, ప్రతిపక్షాలకు చివరికి హైకోర్టుకి కూడా ప్రభుత్వం సంజాయిషీలు చెప్పుకొనే పరిస్థితి ఏర్పడింది.

ఇది కాక జి.హెచ్.ఎం.సి.పరిధిలో ఓటర్ల జాబితాలు సవరణ పేరిట 6.32 లక్షల మంది ఆంధ్రా ఓటర్ల పేర్లను తొలగించడం, మరికొన్ని లక్షల మంది పేర్లను తొలగించదానికి నోటీసులు పంపారు. అందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఆందోళన చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి పిర్యాదు చేయడంతో, డిల్లీ నుంచి పశ్చిమ బెంగాల్‌ సీఈవో సునీల్‌ గుప్తా నేతృత్వంలో ఉత్తరప్రదేశ్‌ అదనపు సి.ఈ.ఓ.,ఆరుగురు కార్యదర్శులు, ఆరుగురు సహాయ కార్యదర్శులతో కూడిన 14 మంది కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల బృందం హైదరాబాద్ వచ్చి క్షేత్ర స్థాయిలో విచారణ చేయడం మొదలుపెట్టింది. వారి ప్రాధమిక పరిశీలనలో ఓటర్ల జాబితా సవరణ పేరిట చాలా మంది పేర్లను అక్రమంగా తొలగించినట్లు గుర్తించినట్లు సమాచారం. దానిపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో తెరాస విజయం సాధించడం కోసమే ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమేశ్ కుమార్ ఇటువంటి పనులకు పూనుకొన్నారని ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి పిర్యాదు చేసాయి. ఎన్నికల సంఘం ఆయనపై చర్యలు తీసుకొనే అవకాశం ఉండటంతో ప్రభుత్వం మిగిలిన ఐ.ఏ.ఎస్‌. అధికారులతో సహా సోమేశ్ కుమార్, జీహెచ్‌ఎంసీ స్పెషల్‌ కమిషనర్లు నవీన్‌ మిట్టల్‌, జి.కిషన్‌లను కూడా బదిలీ చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సోమేశ్ కుమార్ స్థానంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ప్రభుత్వం జనార్దన్‌ రెడ్డిని నియమించింది. కానీ మిగిలిన ఇద్దరి స్థానాలను వేరేవారితో భర్తీ చేయలేదు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే సోమేశ్ కుమార్ వ్యవహరించినప్పటికీ చివరికి ఆయనకు బదిలీ శిక్ష తప్పలేదు. ఆయనను అప్రధాన్య శాఖగా భావించే గిరిజన సంక్షేమ శాఖకు ముఖ్య కార్యదర్శిగా నియమించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి…కవితకు బెయిల్ దక్కేనా..?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ అధికారుల వద్ద అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి తాజాగా సీబీఐ అధికారుల ముందు కూడా అప్రూవర్...

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close