తెలకపల్లి రవి : రాజీనామాకు ఈశ్వరి సవాలు

శుక్రవారం సాయింత్రం హెచ్‌ఎంటివి ఛానల్‌లో విజయమాల్యా పలాయనం, తర్వాత వైసీపీ అవిశ్వాస తీర్మానం గురించి చర్చ జరిగింది. జూపూడి ప్రభాకరరావు, జోగు రమేష్‌,నేను పాల్గొన్నాము. మధ్యలో మాజీ మంత్రి శైలజానాథ్‌ ఫోన్‌లో మాట్లాడారు. అవిశ్వాస తీర్మానం తీసుకురావడం ప్రతిపక్షం హక్కు, సంప్రదాయం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనేక వాగ్దానాల అమలులో విఫలమైనా, రుణమాఫీ వంటివి పాక్షికంగానే అమలు చేసినా ఇప్పటికిప్పుడు ఈ ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహం తీవ్ర వ్యతిరేకతగా మారిందని చెప్పలేమని నేనన్నాను. వైసీపీ నుంచి ఫిరాయింపుల నేపథ్యంలో తమ బలాన్ని చూసుకోవడానికి కూడా ఈ చర్చతీసుకుని వచ్చినట్టు కనిపిస్తుంది. ఈ సభలో ఇప్పటి వరకూ ప్రతిపక్షం పాత్రను ప్రభుత్వం గట్టెక్కిపోతున్న తీరును చూస్తే మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరముందని చెప్పాను. శైలజానాథ్‌ కూడా అలాటి అభిప్రాయమే వెలిబుచ్చారు.

జూపూడి ప్రభుత్వం వాగ్దానాలను అమలు చేస్తున్నదని చెబుతూ వైసీపీకి గనక విశ్వాసముంటే రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళ్లవచ్చని సవాలు విసిరారు. ఈ దశలో పాడేరు శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరి అనుకోకుండా లైన్‌లోకి వచ్చి సోమవారం నేను రాజీనామా చేస్తాను మీరు సిద్ధమేనా…అని సవాలు చేశారు. తనపై ఎవరినైనా పోటీ పెట్టొచ్చు గాని తాను గెలిస్తే చంద్రబాబు రాజీనామా చేస్తారా? అని అడిగారు. చర్చ నిర్వహిస్తున్న వెంకటకృష్ణ కూడా ఆమెను అభినందించి జూపూడి ప్రతిస్పందన కోరడంతో ఆసక్తికరంగా మారింది. దళితులు గిరిజనులే ఎందుకు రాజీనామా చేయాలి, మీరు కాదు మీ నాయకుడి నుంచి రావాలి అని ఆయన అన్నారు గాని వాటికి అంత తీవ్రత రాలేదు. అనుకోని ఈ సవాలుతో చర్చ ముగిసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close