మెలోడీకి.. ఇది మంచి డీలే!

వ‌రుస ప‌రాభ‌వాల దృష్ట్యా.. సినిమాల్ని కొనే విష‌యంలో ఓటీటీ సంస్థ‌లు ఆచి తూచి అడుగులేస్తున్నాయి. మ‌రీ ముఖ్యంగా చిన్న సినిమాల‌కు ఆమ‌డ దూరం ఉంటున్నాయి. అమేజాన్ లాంటి సంస్థ‌లైతే.. కొన్నాళ్ల పాటు చిన్న సినిమాల్ని కొనొద్ద‌ని గ‌ట్టిగా తీర్మాణించుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆనంద్ దేవ‌ర‌కొండ సినిమా `మిడిల్ క్లాస్ మెలోడీస్‌` ఇప్పుడు అమేజాన్‌లో విడుద‌ల అవుతోంది. చిన్న సినిమాల్ని పే ఫ‌ర్ వ్యూ ప‌ద్ధ‌తిన (ఎంత‌మంది చూస్తే అన్ని డ‌బ్బులు) కొనుక్కునే అమేజాన్ ఈసినిమాకి మాత్రం మంచి రేటు ఇచ్చింది. రూ.4.5 కోట్ల‌కు `మిడిల్ క్లాస్‌..`ని కొనేసింది. ఆనంద్ సినిమాకి ఇది మంచి రేటే. త‌న తొలి సినిమా `దొర‌సాని` ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌క‌పోయినా, ఆ ప్ర‌భావం ఈ సినిమాపై ప‌డ‌లేదు.

పైగా ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్ కి మంచి స్పంద‌న వ‌చ్చింది. కేవ‌లం 5 రోజుల్లోనే 10 మిలియ‌న్‌ వ్యూస్ ని సొంతం చేసుకుంది. చిన్న సినిమా ట్రైల‌ర్‌కి ఈ స్థాయి వ్యూస్ రావ‌డం శుభ సూచిక‌మే. పైగా `గుంటూరు` పాట కూడా జ‌నాల్లోకి వెళ్ల‌గ‌లిగింది. గుంటూరు ప్రాంత ప్రాముఖ్య‌త‌ని ఈ ఒక్క పాట‌లో చూపించారు. ఓ ర‌కంగా గుంటూరోళ్ల‌కు ఈ పాట ప్రాంతీయ గీతంగా చ‌లామ‌ణీ అయిపోతున్న‌ట్టే. ఇలా ఎటు చూసినా మిడిల్ క్లాస్‌కి అన్నీ మంచి శ‌కునాలే క‌నిపిస్తున్నాయి. మ‌రి ఓటీటీ బ‌రిలో.. ఈసినిమా ఎలా నిల‌బ‌డుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ బెంగళూర్ టూర్.. కథేంటి?

ఇప్పటికే ఇండియా కూటమికి చేరువయ్యేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రచారం గుప్పుమంటోన్న నేపథ్యంలో జగన్ బెంగళూర్ పర్యటన సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఇటీవలే హడావిడిగా బెంగళూర్ నుంచి వచ్చి..ఆపై ఢిల్లీ ధర్నా అని చెప్పి...అక్కడి...

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close