రానున్న రోజుల్లో ప్రపంచంలోని వ్యవస్థలన్నింటిని ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) శాసించడం ఖాయమని ఇప్పటికే అర్థమవుతోంది. అన్ని రంగాల్లో ఏఐ మార్క్ కనిపించడం తథ్యం అని … ఏఐ సేవలు మరింత అందుబాటులోకి వస్తే ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగ సంక్షోభం తప్పదని సాంకేతిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
దీనిపై రకరకాల చర్చలు జరుగుతుండగా గూగుల్ డీప్ మైండ్ సీఈవో డెమిస్ హస్సాబిస్ ఏఐ గురించి కీలక అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఉద్యోగం రంగంలో ఎలాంటి సంక్షోభం ఉంటుందో కానీ, దాన్ని దుర్వినియోగం చేయడమే అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. ఈ సాంకేతికత విప్లవాన్ని సరిగ్గా ఉపయోగిస్తే అద్భుతమైన పనులను సులభంగా, సమర్థవంతంగా పూర్తి చేయవచ్చని వెల్లడించారు.
ఏఐ మనుషుల ఉద్యోగాలను భర్తీ చేస్తుంది అనే భయం కంటే , ఈ శక్తివంతమైన సాంకేతిక దురుద్దేశాలు ఉండే వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే ప్రపంచం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఒకవేళ అదే జరిగితే ప్రపంచం అంతటా వినాశకర పరిస్థితులు ఏర్పడుతాయని తెలిపారు. అందుకే ఏఐ యాక్సెస్ ను పరిమితం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం రోజురోజుకు పెరుగుతోన్న నేపథ్యంలో దాని దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అంతర్జాతీయ సహకారం అవసరం అని డెమిస్ హస్సాబిస్ నొక్కి చెప్పారు.