పుష్కరస్నానంలో గవర్నర్ సమన్యాయం

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా వ్యవహరిస్తున్న నరసింహన్ అసలే పరమభక్తుడు. వీలు దొరికితే చాలు తిరుమల వెళ్ళి దైవదర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇక మహా పుష్కరాలకు హాజరవకుండా ఉంటారా! అయితే రెండు రాష్ట్రాలలో ఒకచోటికి వెళితే మరొకరిని నొప్పించినట్లువుతుందనుకున్నారో, ఏమో!  పుష్కరస్నానంలో సమన్యాయం ప్రదర్శించారు. ఇరు రాష్ట్రాలలోనూ గోదావరిలో పుష్కరస్నానమాచరించారు. ఉదయం హైదరాబాద్‌నుంచి సతీసమేతంగా మొదట రాజమండ్రి వెళ్ళి సరస్వతి ఘాట్‌లో స్నానం చేశారు. తర్వాత వసతిగృహానికి వెళ్ళి బట్టలుమార్చుకున్నారు. సింగపూర్ బృందంతో బిజీగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వచ్చి ప్రొటోకాల్ ప్రకారం గవర్నర్‌ను పలకరించారు. తర్వాత గవర్నర్ అక్కడనుంచి హెలికాప్టర్‌లో ఖమ్మంజిల్లాలోని భద్రాచలంవెళ్ళి సమీపంలోని మోతే పుష్కరఘాట్‌లోకూడా స్నానమాచరించారు. భద్రాచలం రామాలయానికి వెళ్ళి దైవదర్శనం చేసుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

ఇంకా “బలమైన” భ్రమల్లోనే కేటీఆర్ !

కేటీఆర్ నియోజకవర్గాల వారీ సమీక్ష సమావేశాల్లో రేవంత్ రెడ్డిని తిట్టి... ఎన్నికల్లో దున్నిపారేస్తామని ప్రసంగించి వెళ్లిపోతున్నారు. గ్రౌండ్ లెవల్లో పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడం లేదు. కనీసం ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close