గుంటూరు జిల్లా టీడీపీలో చేరికల హుషారు !

గుంటూరు, పల్నాడు జిల్లాల్లో వైసీపీ పూర్తిగా బలహీనపడుతోంది. ఆ పార్టీ నుంచి ద్వితీయ శ్రేణి నాయకత్వం అంతా వరుసగా టీడీపీలో చేరిపోతున్నారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు అనేక మంది టీడీపీలో చేరుతున్నారు. ఫలితంగా స్థానిక సంస్థల్లో బలబలాలు మారిపోతున్నాయి.

జిల్లాపరిషత్‌ చైర్‌పర్సన్‌ క్రిస్టినాతోపాటు ఇప్పటివరకు 8 మంది జడ్పీటీసీలో టీడీపీలో చేరారు. పలువురు ఎంపీపీలూ అదే పని చేశారు. అనేక మండలాల్లో టీడీపీ మెజార్టీలోకి వచ్చింది. అమరావతి ఎంపీపీ, డిప్యూటీ ఎంపీపీ కూడా టీడీపీలో చేరారు. గుంటూరు కార్పొరేషన్‌లో డిప్యూటీ మేయర్‌ సజీలాతోపాటు 8 మంది కార్పొరేటర్లు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. గుంటూరు మేయర్ చిలుకలూరిపేట అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన గుంటూరు వచ్చే సరికి ఆయన మేయర్ పదవి పోయే పరిస్థితి ఏర్పడింది. గుంటూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు, ఆయన సోదరుడు, మాజీ డిప్యూటీమేయర్‌ తాడిశెట్టి మురళీ కూడా టీడీపీలో చేరారు. గుంటూరు తూర్పులో మాజీ ఎమ్మెల్యే నంబూరు సుభానీ, ఆయన కుమారుడు మాజీ డిప్యూటీ మేయర్‌ గౌస్‌ పసుపు కండువా కప్పుకున్నారు. చిలు కలూరిపేటలో సమన్వయకర్తగా ఉన్న మల్లెల రాజేష్‌ నాయుడు టిక్కెట్‌ రాకపోవడం తో టీడీపీలో చేరారు. ఆయనతోపాటు పలువురు కౌన్సిలర్లు, జెడ్‌పీటీసీని టీడీపీలోకి తెచ్చారు.

తెనాలి, చిలకలూరిపేటతో పాటు మునిసిపాలిటీలలో కౌన్సిలర్లు టీడీపీలో చేరడంతో అక్కడా టీడీపీకి ఆధిక్యం వచ్చింది. లావు శ్రీకృష్ణదేవరాయులు వెంట పల్నాడులో వైసీపీ క్యాడర్ టీడీపీలోకి వచ్చింది. పల్నాడులో దౌర్జన్యాలతో వచ్చిన విజయాలతో కూడా నిలబడటం లేదు. జంగా కృష్ణమూర్తి రాకతో గురజాలలో స్థానిక సంస్థల్లో టీడీపీదే పైచేయి అవుతోంది. తాడికొండలో ఎమ్మెల్యే శ్రీదేవి, వైసీపీ సమన్వయకర్తలుగా పనిచేసిన డొక్కా మాణిక్య వర ప్రసాద్‌, కత్తెర సురేష్‌ కూడా టీడీపీలో చేరారు. వారి అనుచరులుగా ఉన్న స్థానిక సంస్థల ప్రతినిధులు టీడీపీ గూటికి చేరారు. వైసిపికి గుడ్‌బై చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకట రమణ కూడా టీడీపీలో చేరారు. రమణ అనుచరులు టీడీపీకి పనిచేస్తున్నారు.

గుంటూరు జిల్లాలో ఈ చేరికలన్ని ప్రభుత్వం మారడం ఖాయమని నిర్ణయానికి రావడంోత.. తర్వాత వచ్చే ప్రభుత్వం నుంచి పదవులు కాపాడుకోవడానికేనన్న చెబుతున్నారు . వైసీపీ ఓటమి ఖాయమని అంతా గట్టిగా నమ్ముతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ బెంగళూర్ టూర్.. కథేంటి?

ఇప్పటికే ఇండియా కూటమికి చేరువయ్యేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రచారం గుప్పుమంటోన్న నేపథ్యంలో జగన్ బెంగళూర్ పర్యటన సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఇటీవలే హడావిడిగా బెంగళూర్ నుంచి వచ్చి..ఆపై ఢిల్లీ ధర్నా అని చెప్పి...అక్కడి...

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close