పంపుసెట్లకు మీటర్లను జగన్ ఎందుకు పెడుతున్నారో చెప్పిన హరీష్ రావు..!

వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెడుతున్న వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో దుమారం రేపుతోంది. ప్రభుత్వ నిర్ణయంపై రైతులు అసంతృప్తితో ఉన్నారు. ఇంకా ప్రక్రియ ప్రారంభం కాలేదు.. ఒక వేళ మీటర్లు పెట్టే ప్రక్రియ ప్రారంభమైతే..రైతులు ఎక్కడికక్కడ మీటర్లను ధ్వంసం చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ మేరకు రాజకీయ పార్టీలు ఇప్పటికే పిలుపునిచ్చాయి. అయితే.. సంస్కరణల కోసం… రైతులకు మెరుగైన విద్యుత్ ఇచ్చేందుకు మీటర్లు అని ప్రభుత్ం చెబుతోంది. కానీ.. అసలు విషయం మాత్రం.. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులు సడలింపులు తీసుకుని మరింత ఎక్కువగా అప్పు తీసుకోవడానికన్న చర్చ అన్ని చోట్లా జరుగుతోంది.

అయితేపెద్ద మొత్తంలో అప్పు వస్తుందని ఏపీ సర్కార్ ఇలా చేయడం లేదు. కేవలం నాలుగంటే నాలుగు వేల కోట్లమే… రైతులకు మీటర్ల కష్టాన్ని ఏపీ సర్కార్ తెచ్చి పెడుతోందట. ఈ విషయాన్ని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు బహిరంగాగానే చెప్పారు. తెలంగాణకు కేంద్రం రూ.2,500 కోట్ల నిధులు ఇచ్చి.. బోరుబావుల దగ్గర మీటర్లు పెట్టమని చెప్పిందని.. కానీ తాము తిప్పికొట్టామని చెప్పుకొచ్చారు. అదే ఏపీకి రూ.4 వేల కోట్లు ఇస్తామంటే జగన్ ఒప్పుకుని మీటర్లు పెట్టారన్నారు. తెలంగాణతో పోలిస్తే.. ఏపీ కాస్త పెద్ద రాష్ట్ర కాబట్టి… పదిహేను వందల కోట్లను ఎక్కువగా ఏపీకి కేంద్రం ఇస్తుందని అనుకోవచ్చు.

ఇప్పటికే.. తెలంగాణ ప్రభుత్వం మీటర్ల జోలికి వెళ్లడం లేదు…. ఏపీ సర్కార్ ఎందుకు వెళ్లాలన్న సందేహం ఏపీ రైతుల్లో వస్తోంది. జగన్ తీరును.. టీఆర్ఎస్ పక్కాగా ఉపయోగించుకుంటోంది. దుబ్బాక ఉపఎన్నికల అంశంలో బిజీగా ఉన్న హరీష్ రావు ఇదే అంశాన్ని అక్కడి రైతులకు పదే పదే చెబుతున్నారు. తాము మీటర్లు పెట్టబోమని … కేంద్రం ఇచ్చే నిధుల కోసం కక్కుర్తి పడి రైతుల్ని ఇబ్బంది పెట్టబోమని పరోక్షంగా చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close