బీజేపీ సోషల్ మీడియా ప్రచారంపైనే హరీష్ గుస్సా..!

దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికల్లో హరీష్ రావు ఆగ్రహం అంతా బీజేపీనే కనిపిస్తోంది. ఆ పార్టీ నేతలు క్షేత్ర స్థాయిలో చేస్తున్న ప్రచారం కాదు… సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారంపైనే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రచారం రేంజ్ ఎలా ఉందంటే.. చివరికి ఆయన సవాళ్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని దమ్ముంటే తన వద్దకు వచ్చి నిరూపించాలని అంటున్నారు. తాను దుబ్బాకలోనే ఉన్నానని ప్లేస్ చెబుతున్నారు. దీనంతటికి కారణం… బీజేపీ సోషల్ మీడియా.. ఆయనపై వ్యక్తిగత రూమర్స్ ప్రచారం చేయడం లేదు. టీఆర్ఎస్ అమలు చేస్తున్న పథకాల్లో… కేంద్ర నిధులు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు.

బీడీ కార్మికులకు ఇచ్చే పెన్షన్‌లో రూ. పదహారు వందలు కేంద్రం ఇస్తోందని బీజేపీ ప్రచారం చేస్తోంది. దాదాపుగా అన్ని పథకాల్లోనూ కేంద్ర నిధులే ఉన్నాయంటున్నారు. ఈ ప్రచారం చాలా జోరుగా సాగుతోంది. ఇది హరీష్‌రావుకు ఆగ్రహం తెప్పిస్తోంది. అందుకే.. కేంద్ర నిధులు ఉన్నాయని నిరూపిస్తే.. తన పదవికి రాజీనామా చేస్తానని కూడా సవాల్ చేస్తున్నారు. అయితే బీజేపీ నేతలు మాత్రం.. అంత కంటే ధీటుగానే ఎదురుదాడి చేస్తున్నారు. బీజేపీ సోషల్ మీడియా కార్యకర్తల్ని బెదిరించడానికి హరీష్ రావు.. అరుస్తున్నారని… తెలంగాణకు ఆరేళ్ల కాలంలో ఇచ్చిన హామీల్ని ఒక్కటైనా నేరవేర్చారో లేదో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అరిచేరావుగా మారి అరిచినంత మాత్రాన జనం ఓట్లేయరని అంటున్నారు.

కానీ హరీష్ రావు మాత్రం వ్యూహాత్మకంగా టీఆర్ఎస్ పథకాలపై మరింత జోరుగా ప్రచారం జరిగే ఉద్దేశంతోనే.. బీజేపీ.. కేంద్ర నిధుల అంశాన్ని హైలెట్ చేస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అప్పుడే.. ప్రభుత్వం నుంచి లబ్ది పొందుతున్న వారు గుర్తు పెట్టుకుని ఓట్లేస్తారని అంటున్నారు. హరీష్ వ్యూహలపై బీజేపీ ఎదురుదాడి చేస్తోందో.. బీజేపీని ప్లాన్డ్ గా పథకాల ప్రచారంలోకి హరీష్ లాగుతున్నారో అర్థం కాని రాజకీయం ప్రస్తుతం దుబ్బాకలో నడుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close