సీఎంఆర్ఎఫ్ చెక్కుల కేసు… హ‌రీష్ రావు ఆఫీస్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

మాజీ మంత్రి హ‌రీష్ రావు పీఏ న‌రేష్ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో చేతివాటం ప్ర‌ద‌ర్శించార‌ని, మ‌రో ముగ్గురితో క‌లిసి ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి చెక్కులు డ్రా చేసుకున్నార‌న్న వార్త‌లు సంచ‌ల‌నంగా మారాయి. ఇప్ప‌టికే కేసు న‌మోదు కాగా, ముగ్గురు నిందితుల‌ను అరెస్ట్ చేశారు.

అయితే, ఈ కేసులో మంత్రి హ‌రీష్ రావు ఆఫీసులో ఇంకెవ‌రి ప్ర‌మేయం అయినా ఉందా? హ‌రీష్ రావును కూడా ఇరికిస్తారా…? అంటూ ర‌క‌ర‌కాలుగా చ‌ర్చ జ‌ర‌గుతున్న స‌మ‌యంలో హ‌రీష్ రావు ఆఫీస్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.

న‌రేష్ అనే వ్య‌క్తి హ‌రీష్ రావు గారికి పీఏ కాద‌ని… ఔట్ సోర్సింగ్ ద్వారా ప‌నిచేస్తున్న కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్ అని వివ‌ర‌ణ ఇచ్చింది. ఈ విష‌యం త‌మ దృష్టికి వ‌చ్చినప్పుడే తాము కేసు న‌మోదు చేశామ‌ని, 17-12-2023నాడు తాము కూడా ఫిర్యాదు చేశామ‌ని…ఎన్నిక‌ల ఫ‌లితాలు రాగానే 06-12-2023నుండే ఆఫీసు నుండి మూసివేసిన‌ట్లు తెలిపింది. త‌ప్పుడు ప్రచారాలు న‌మ్మ‌వ‌ద్ద‌ని విజ్ఞ‌ప్తి చేసింది.

అస‌లు కేసు ఏంటీ?

హ‌రీష్ రావు మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఆయ‌న పేషీలో ఉండే న‌రేష్ అనే వ్య‌క్తి సీఎంఆర్ఎఫ్ చెక్కులు చూసేవారు. కానీ ఆ చెక్కులు ఇచ్చే స‌మ‌యంలో డ‌బ్బులు వ‌సూలు చేస్తార‌న్న ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. వీడియోలు కూడా మీడియాలో వ‌చ్చాయి. తాజాగా ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ల‌బ్ధిదారుల‌కు రావాల్సిన మొత్తాన్ని తీసుకున్న‌ట్లు తేల‌టంతో కేసు న‌మోదైంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మిక్కీలో ఇంత మాస్ ఉందా ?

మిక్కీ జే మేయర్ అంటే మెలోడీనే గుర్తుకువస్తుంది. హ్యాపీ డేస్, కొత్తబంగారులోకం, లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్.. ఇలా బిగినింగ్ డేస్ లో చేసిన సినిమాలు ఆయనకి మెలోడీని ముద్రని తెచ్చిపెట్టాయి. మిక్కీ...

ఆ రెండు స్కాములపైనా విచారణ.. హింట్ ఇచ్చిన రేవంత్

బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్స్ లో పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపణలు చేసిన కాంగ్రెస్..వీటిపై త్వరలోనే విచారణకు ఆదేశించనుందా..? అంటే జరుగుతోన్న పరిణామాలను చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. తెలంగాణ...

టైమ్స్ జాబితాలో హైద‌ర‌బాదీ మ‌నం చాక్లెట్స్

బెస్ట్ చాక్లెట్స్ ఏవీ అన‌గానే స్విస్ చాక్లెట్స్ అంటారు. లేదా బెల్జియ‌మ్ చాక్లెట్స్ గుర్తుకొస్తాయి. కానీ ప్ర‌పంచంలో ది బెస్ట్ చాక్లెట్స్ లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని ప‌శ్చిమ గోదావ‌రి రైతులు పండించిన కోకోతో...

ఊరించి.. ఊరించి.. ఉసూరుమనిపించిన కేసీఆర్ !

ఇక నుంచి నా ఉగ్రరూపం చూస్తారు.. చీల్చిచెండాడుతానని అసెంబ్లీ వద్ద భీకర ప్రకటనలు చేశారు..ఈ ఒక్క డైలాగ్ ద్వారా ఇక కేసీఆర్ అసెంబ్లీకి హాజరు అవుతారని..రేవంత్ సర్కార్ కు చుక్కలు చూపిస్తానని సంకేతాలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close