సీబీఐ విచారణకే వివేకా కుమార్తె పట్టు..! హైకోర్టు తీర్పు రిజర్వ్..!

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు… వివేకా హత్య కేసును నీరుగారుస్తారన్న అనుమానంతోనే జగన్మోహన్ రెడ్డి సీబీఐ విచారణ కోరారని.. ఇప్పుడు ఆ అవసరం లేదని భావిస్తున్నారని…అడ్వకేట్ జనరల్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వివేకా హత్య కేసును సీబీఐకి ఇవ్వాలని వివేకా కుమార్తె సునీత సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ ముగిసింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ కీలక వాదనలు వినిపించారు. అయితే..ఈ వాదనపై.. వైఎస్ వివేకా కుమార్తె సునీత తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తంచేశారు.

కర్నూలులోని ఓ కేసును సీబీఐకి ఇస్తామని ప్రకటన చేశారని.. వివేకా కేసులో అలా ఇవ్వడానికి అభ్యంతరమేంటని పిటిషనర్‌ తరపున లాయర్‌ ధర్మాసనం దృష్టికితీసుకెళ్లారు. గత విచారణ సందర్భంగా…హైకోర్టు ఆదేశించినట్లుగా పోస్టుమార్టం నివేదిక, జనరల్‌ కేసు డైరీని పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఇరు వర్గాల వాదనలు పూర్తి కావడంతో తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. గత ఎన్నికల ముందు జరిగిన వివేకా హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఎలాంటి ఆధారాలు లేకపోయినా…సాంకేతిక పరిజ్ఞానంతో సంక్లిష్టమైన కేసుల్ని చేధించిన పోలీసులకు.. కళ్ల ముందు కనిపించే సాక్ష్యాలున్నప్పటికీ.. వివేకా హత్య కేసును మాత్రం కొలిక్కి తేలేకపోతున్నారు.

పదిహేను వందల మందికిపైగా అనుమానితులని కోర్టుకు చెప్పి.. పోలీసులు అభాసుపాలయ్యారు. సీఎం సోదరి స్వయంగా ప్రభుత్వ విచారణపై.. పోలీసులపై నమ్మకం లేదని హైకోర్టుకే తెలిపింది. విచారణలో వేగం లేకపోవడం… బాధితులు… ఆరోపణలు ఉన్న వారు కూడా.. సీబీఐ విచారణకే డిమాండ్ చేయడంతో.. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ ప్రారంభమయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close