స్నేహితుడి కోసమే అర్జున్ – కానీ వాడేసిన వైసీపీ

హీరో అల్లు అర్జున్ నంద్యాల పర్యటన కలకలం రేపింది. అల్లు అర్జున్ తో పాటు ఆయన భార్య స్నేహకు చాలా కాలం నుంచి మంచి మిత్రుడు అయిన రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎదురీదుతూండటంతో ఆయన చివరి వచ్చి నంద్యాల వచ్చారు. ఈ విషయాన్ని పట్టణం అంతా విస్తృతంగా ప్రచారం చేసి ఎక్కువ మంది జనం వచ్చేలా చేసుకోగలిగారు అభ్యర్థి. నిజానికి అల్లు అర్జున్ గత ఎన్నికల్లో రాలేదు. కానీ ఇప్పుడు వచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఎంత రాగ్ స్టెప్‌నో ఆయనకు వెంటనే అర్థమయ్యే పరిణామాలు చోటు చేసుకున్నాయి.

అల్లు అర్జున్ .. తన స్నేహితుడి కోసం నంద్యాల వస్తున్నారని తెలిసిన వెంటనే ఐ ప్యాక్ రంగంలోకి దిగిపోయింది. జనసేన జెండాలతో వైసీపీ నేతలు అర్జున్ పర్యటనలో హల్ చల్ చేశారు. ఇలా సిగ్గు లేకుండా జన సేన జెంాలను ఎలా వాడుకుంటారని ఎవరైనా ఆశ్చర్యపోతారు. కానీ ఇలాంటి రాజకీయాల్లో వైసీపీ ఎలాంటి సిగ్గు పడదు. మిత్రుడి ఇంట్లో ఆతిధ్యం స్వీకరించిన తర్వాత అల్లు అర్జున్ నోటి నుంచి వైసీపీ అనే మాట రాలేదు. తాను తన మిత్రుడి కోసమే వచ్చానని పార్టీలతో సంబంధం లేదన్నారు.

కానీ ఆయనకు మెగాస్టార్ ట్యాగ్ ఇచ్చి వైసీపీ మీడియా హల్ చల్ చేసింది. సోషల్ మీడియాలో ఆయన వైసీపీకి ప్రచారం చేసినట్లుగా జోరుగా ట్రెండింగ్ చేసుకున్నారు. ఇది ఆయనకు.. మెగా అభిమానులకు మధ్య మరింత దూరం పెంచేలా చేయడంలో వైసీపీ సక్సెస్ అయింది. ఆయనను మెగాస్టార్ చేయడంతో పాటు జనసేన జెండాలను వాడటంతో… తన మిత్రుడు తనను ట్రాప్ చేశాడని అర్థమై ఉంటుంని ఇండస్ట్రీలో సెటైర్లు పడుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘రైట్స్‌’ గొడ‌వ‌.. మ‌రోసారి వార్త‌ల్లోకి ఇళ‌య‌రాజా

ఇళ‌య‌రాజా గొప్ప సంగీత ద‌ర్శ‌కుడే! ఆయ‌న శ్రోత‌ల‌కు, సంగీత ప్రియుల‌కు ఇచ్చిన అద్భుతమైన పాట‌లు కాస్తా త‌ర‌త‌రాల‌ జ్ఞాప‌కాలుగా మారిపోయాయి. ఇళ‌య‌రాజాకు సంగీత ద‌ర్శ‌కుడిగా నూటికి రెండొంద‌ల మార్కులేసే వాళ్లంతా, ఆయ‌న...

తీన్మార్ మల్లన్నకు పార్టీ సపోర్ట్ నామమాత్రమే… రీజన్ ఇదేనా..?

వరంగల్ ,ఖమ్మం , నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు పార్టీ నేతల నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందటం లేదనే చర్చ జరుగుతోంది....

వైసీపీ గెలుపును గట్టిగా కోరుకుంటున్న బీఆర్ఎస్..!?

తెలంగాణలో మళ్లీ బలపడాలంటే ఏపీలో వైసీపీ గెలవాలని బీఆర్ఎస్ గట్టిగా కోరుకుంటోంది. కూటమి గెలిస్తే బీఆర్ఎస్ అస్తిత్వం కనుమరుగు అవుతుందని గులాబీ నేతలు గుసగులాడుకుంటున్నారు. వైసీపీ గెలిస్తే ఎలాగూ తెలంగాణతో నీటి వాటాల...

ఎన్టీఆర్‌తో ర‌ష్మిక‌?

ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ కాంబో ఓకే అయిపోయింది. సెప్టెంబ‌రు నుంచి చిత్రీక‌ర‌ణ కూడా మొద‌లు పెట్ట‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. 'దేవ‌ర‌' అవ్వ‌గానే ఎన్టీఆర్ ప్ర‌శాంత్ నీల్ ప్రాజెక్టుకు కాల్షీట్లు ఇచ్చేశాడు. ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close