ఏపీ ప్రగతికి మెరుగైన ప్యాకేజీ?

ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక రాష్ట్ర హోదా లేదనేది కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. రాజధాని శంకుస్థాపనకు రాబోతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఒక నిర్మాణాత్మకమైన ప్యాకేజీని ప్రకటిస్తారని తెలుస్తోంది. పెండింగ్ పనులను పూర్తి చేయడంతో పాటు కొత్త ప్రాజెక్టుల ఏర్పాటు, ఆర్థిక అభివృద్ధి సహాయం అనే అన్ని అంశాలనూ జోడించి ప్యాకేజీ రూపొందుతున్నట్టు సమాచారం. ఏపీకి సంబంధించిన పూర్తి సమాచారం పంపాలంటూ కొన్ని రోజుల క్రితం నీతి ఆయోగ్ అన్ని శాఖలకు ఓ సర్క్యులర్ పంపింది. ఏపీకి ఇచ్చిన హామీలు, వాటి ప్రస్తుత స్థితి, వగైరా వివరాలను ఆయా శాఖలు నీతి ఆయోగ్ కు పంపాయి. వాటి ఆధారంగా ఓ రోడ్ మ్యాప్ సిద్ధమవుతోంది. ఏపీని అభివృద్ధి చేయడానికి కేంద్రం ఏయే చర్యలు తీసుకోవాలనే దానిపై ఇప్పటికే స్పష్టత వచ్చినట్టు సమాచారం.

ఇప్పటికే ఏపీలో ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటు, ఇతర హామీలను కేంద్రం నిలబెట్టుకుంది. నిధులకు సంబంధించి దశల వారీగా విడుదల చేసేలా మోడీ ప్యాకేజీ ప్రకటిస్తారని తెలుస్తోంది. ఏపీకి ముఖ్యంగా రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం వంటి విషయాల్లో కేంద్ర ప్రభుత్వ పూర్తి సహకారం అవసరం. ఈ విషయంలోనూ మోడీ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ప్రధాన మంత్రి అయిన తర్వాత తొలిసారిగా వస్తుండటం, అందునా రాజధాని శంకుస్థాపన తన చేతుల మీదుగా జరుగుతుండటంతో ప్రజలను నిరాశ పరచరాదని మోడీ భావిస్తున్నారని సమాచారం. కేంద్రం మంత్రి వెంకయ్య నాయుడు కూడా ఏపీకి చేయాల్సిన సహాయం గురించి పలు విషయాలను మోడీకి వివరించినట్టు భోగట్టా.

ఈ ఫీడ్ బ్యాక్ ఆధారంగా ప్యాకేజీ దాదాపుగా కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. నీతి ఆయోగ్ అన్ని అంశాలనూ సమగ్రంగా విశ్లేషించి ప్రధానికి నివేదికను సమర్పించినట్టు సమాచారం. బీహార్ కంటే మెరుగైన ప్యాకేజీయే ఇస్తామని ఇటీవల కొందరు కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు సంకేతాలిచ్చారు. వాటికి అనుగుణంగానే మోడీ అమరావతి శంకుస్థాపన సభలో ప్యాకేజీని ప్రకటించే అవకాశం ఉందని బీజేపీ వర్గాల సమాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close