ప్రజారాజధాని అమరావతి.. తిరుపతిలో మార్మోగిన ఒకే వాయిస్ !

ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష తిరుపతి వేదికగా స్పష్టమయింది. రైతులు నిర్వహించిన మహోద్యమ సభకు అన్ని పార్టీల నేతలూ హాజరయ్యారు. అందరూ ఏకైక రాజధానిగా అమరావతి ఉండాని నినదించారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అంగీకరించి అడ్డగోలుగా చేసిన మోసాన్ని అందరూ ప్రజల ముందు పెట్టారు. చివరికి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా అదే చెప్పారు. ఎక్కడా భిన్నాభిప్రాయం వినిపించలేదు. అమరావతి నిర్మాణం చేతకాకపోతే తప్పుకోవాలని అందరూ ముక్త కంఠంతో జగన్‌కు సలహా ఇచ్చారు.

టీడీపీ అధినేత చంద్రబాబు సహా అందరూ అమరావతి ఆకాంక్ష ప్రజల్లో ఉందని.. అమరావతి ప్రజారాజధానిగా స్పఅటం చేశారు. జగన్‌రెడ్డిది చేతకాని అసమర్థ ప్రభుత్వమని చంద్రబాబు మండిపడ్డారు. బీజేపీ తరపున హాజరైన కన్నా లక్ష్మినారాయణ హాజరై దోచుకునేందుకు విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారని విమర్శఇంచారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు చెందిన అందరూ నేతలు హాజరయ్యారు. అమరావతి రైతుల సభకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. వంద మందికిపైగా పట్టేలాస్టేజ్‌ను రూపొందించారు. అయితే అన్ని పార్టీల నుంచి నేతలు తరలిరావడంతో స్టేజ్ కూడా కిక్కిరిసిపోయింది.

అమరావతికి భూములు ఇచ్చిన రైతులు నెలన్నర పాటు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ పాదాయత్ర చేసి తమ సంకల్పాన్ని చాటారు. ఎన్ని విమర్శలు.. లాఠీచార్జ్‌లు.. నిర్బంధాలు ఎదురైనప్పటికీ సభకు భారీగా జన సమూహం తరలి రావడంతో రైతులు తమ ప్రయత్నాల్లో మరో అడుగు ముందుకేశామన్న సంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టు అనుమతిలో నిర్వహించిన సభ కాబట్టి .. అనుమతించిన సమయం ఆరు గంటల కల్లా ప్రసంగాలు పూర్తి చేసి సభను ముగించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close