బద్వేలులో బీజేపీకి జనసేన సహకరిస్తుందట ! ఏ రకంగా ?

జనసేన పార్టీకి రాజకీయం చేయడంలో ఇప్పటికీ గందరగోళ పరిస్థితినే ఎదుర్కొంటోంది. దివంగత ఎమ్మెల్యే భార్యనే వైసీపీ అభ్యర్థిగా నిలబెట్టినందున తాము ఎన్నికలకు దూరంగా ఉన్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. అయితే మిత్రపక్షం బీజేపీతో సమన్వయం చేసుకోలేదు. తమ నిర్ణయం తాము ప్రకటించారు. మిత్రపక్షం జనసేన నిర్ణయాన్ని ఆమోదించడానికి బీజేపీ అంగీకరించలేదు. అభ్యర్థిని నిలబెట్టింది.

పవన్ కల్యాణ్ మద్దతు అడుగుతామని సోము వీర్రాజు ప్రకటించారు. ఇప్పుడు పవన్ అపాయింట్ మెంట్ ఇవ్వడం కష్టమే కానీ.. పవన్ తర్వాత జనసేనలో పెద్ద లీడర్‌గా పేరున్న నాదెండ్ల మనోహర్ మాత్రం బీజేపీ అభ్యర్థికి సహకరిస్తామని ప్రకటించారు. బీజేపీతో కలిసే ఉన్నామని విడిపోలేదని చెప్పుకొచ్చారు. దివంగత ఎమ్మెల్యే భార్యకు మద్దతుగానే ఎన్నికల నుంచి విరమించుకున్నామని ప్రకటించిన తర్వాత జనసేన బీజేపీ అభ్యర్థికి ఎలా సహకరిస్తుందో ఎవరికీ అర్థం కాని విషయం. రాజకీయ విధానాల్లో క్లారిటీ లేకపోవడం వల్లే జనసేనకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి.

అయినా గుర్తించలేకపోతున్నారు. ఇలా మద్దతు ఇచ్చే పని అయితే.. మీరే పోటీ చేయండి అని ముందుగానే బీజేపీకి ఓ మాట చెప్పి ఉంటే సరిపోయేది. కానీ నాదెండ్ల మనోహన్ చేసిన సహకారం ప్రకటన వల్ల ఎందుకు ఉపఎన్నిక నుంచి వైదొలిగారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి గందరగోళ నిర్ణయాలను జనసేన వదిలి పెట్టనంత కాలం గడ్డు పరిస్థితే ఉంటుందని జనసైనికులు ఆందోళన చెందుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close