అమ్మకానికి హైదరాబాద్ మెట్రో..?

హైదరాబాద్ మెట్రోను విక్రయించేందుకు ఎల్ అండ్ టీ సిద్దమైందా..? నష్టాల పేరిట మెట్రోను విక్రయించేందుకు నిర్ణయం తీసుకుందా..?

అంటే అవుననే సమాధానం వస్తోంది. అయితే మెట్రోను ఇప్పట్లో అమ్మకానికి పెట్టడం లేదని…2026 తర్వాత విక్రయించాలనుకుంటున్నట్లు ఎల్ అండ్ టీ ప్రెసిడెంట్ ఆర్ శంకర్ స్పష్టం చేశారు. 65ఏళ్ల వరకు సంస్థను విక్రయించేందుకు వీలు లేదన్న ఆయన ఎల్ అండ్ టీకి వస్తోన్న నష్టాల నేపథ్యంలో మెట్రో అమ్మకానికి వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.

సంస్థకు గణనీయమైన నష్టాలు వస్తుండటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా ఓ ఛానెల్ తో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణం వలన ఎక్కువగా పురుషులే మెట్రోలో ప్రయనిస్తున్నారని, మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గిందన్నారు. అలాగే, ఊబర్ , ఓలా, రాపిడో వంటి సంస్థల వలన కూడా మెట్రోలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య తగ్గిందని శంకర్ తెలిపారు. సంస్థకు వస్తోన్న లోటును పూడ్చుకునేందుకు చర్యలు చేపట్టినా ఫలితాన్ని ఇవ్వకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

అయితే, గతంలో కూడా ఇలాగే నష్టాల పేరుతో అమ్మకానికి సిద్దమైందని లీకులు ఇవ్వడంతో ఎల్ అండ్ టీకి ప్రభుత్వం అనేక సబ్సిడీలను కల్పించడంతో నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. మెట్రోలో రోజురోజుకూ రద్దీ పెరుగుతున్నా మళ్లీ నష్టాలు వస్తున్నాయని ఎల్ అండ్ టీ వ్యాఖ్యానించడం పలు అనుమానాలకు తావిస్తోంది. గతంలోలాగే ఇప్పుడు కూడా అలాంటి సబ్సిడీల కోసమే మెట్రో అమ్మకమంటూ ఎల్ అండ్ టీ లీకులు ఇస్తుందా..? అనే ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా?

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని సర్కార్ ప్రకటించినా... వాలంటీర్లలో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. జులై మొదటి తేదీన సచివాలయం సిబ్బందితో ఫించన్ లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం.. వాలంటీర్ల అవసరం...

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close