ఏపీలో పని చేయడానికి పెద్దగా ఇష్టపడకుండా ఎలాంటి దారి దొరికినా తెలంగాణకు వెళ్లిపోదామని ప్రయత్నిస్తున్న ఐఏఎస్ అధికారి కాట అమ్రపాలికి ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చింది. 2010 బ్యాచ్కు చెందిన ఐదుగురు ఐఏఎస్ అధికారులను సూపర్ టైమ్ స్కేల్ కు, క్యాడర్కు సమానంగా, 2026 జనవరి 1 నుండి అమలులోకి వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. వీరికి ప్రభుత్వ కార్యదర్శులు గా హోదా వస్తుంది.
పదోన్నతి పొందిన అధికారులలో చదలవాడ నాగరాణి , నారాయణ భరత్ గుప్తా, అమ్రపాలి కాటా, జె. నివాస్, గంధం చంద్రుడు ఉన్నారు. పదోన్నతుల అనంతరం నారాయణ భరత్ గుప్తాను అదే పదవిలో కొనసాగిస్తూ కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్, ఆర్యూఎస్ఏ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా కొనసాగిస్తున్నారు. అమ్రపాలి కాటా ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్గా కొనసాగనున్నారు. గంధం చంద్రుడిని కార్మిక శాఖ కమిషనర్గా నియమిస్తూ, పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఎం.వి. శేషగిరి బాబును రిలీవ్ చేశారు. చదలవాడ నాగరాణి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్గా అదే పదవిలో కొనసాగనున్నారు.
కాట అమ్రపాలి కాకుండా మిగతా నలుగురిలో కొంత మంది వైసీపీ హయాంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో రూల్స్ కు విరుద్ధంగా అనేక పనులు చేశారని విమర్శలు పాలయ్యారు. అయినా ప్రభుత్వం అలాంటివేమీ పట్టించుకోకుండా.. వారి సీనియార్టీకి తగ్గట్లుగా పదోన్నతులు కల్పించింది.
