రాజస్థాన్ లో రూ.13,000 కోట్లు నల్లధనం స్వాధీనం!

విదేశాలలో నల్లధనం వెనక్కి రప్పించే ప్రయత్నంలో మోడీ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా విదేశాలలో నల్లధనం దాచుకొన్నవారు స్వచ్చందంగా ఆ వివరాలను బయటపెట్టి, దానిపై 30శాతం జరిమానా, మరో 30 శాతం పన్ను చెల్లించి శిక్ష పడకుండా తప్పించుకొనే వెసులుబాటు కల్పించింది. గతేడాది జూలై 1వ తేదీ నుండి ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు ఇచ్చిన గడువులో మొత్తం 638 మంది స్వచ్చందంగా తమ నల్లధనం వివరాలను ఆదాయపన్ను శాఖ అధికారులకు సమర్పించి మొత్తం రూ.3, 770 కోట్లు చెల్లించారు.

ఆ మరునాడు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని తమ నల్లధనం వివరాలను బయటపెట్టి పన్నులు, జరిమానాలు చెల్లించినవారందరూ ఇకపై నిశ్చింతగా నిద్ర పోవచ్చును. కానీ మిగిలినవారు మాత్రం మా ప్రభుత్వం చేపట్టబోయే కటినమయిన చర్యలు ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండక తప్పదు. ఇక నుండి నల్లధనం దాచినవారికి 10 ఏళ్ల జైలు శిక్ష దానితో బాటు వారు దాచిన నల్లధనంపై 120 శాతం జరిమానా విధిస్తారు.

గడువు తేదీ ముగిసిన వెంటనే ఆదాయపన్ను శాఖ అధికారులు నల్లధనం దాచినవారిపై దాడులు నిర్వహించడం మొదలుపెట్టారు. ఇటీవల కోలీవుడ్ హీరో విజయ్, హీరోయిన్లు సమంత, నయనతారల ఇళ్ళపై ఆదాయపన్ను శాఖ అధికారులు జరిపిన దాడుల్లో చాలా భారీ మొత్తం స్వాధీనం చేసుకొన్నట్లు వార్తలు వచ్చేయి. రాజస్థాన్ రాష్ట్రంలో కిషన్ ఘడ్ అనే పట్టణంలో ఆర్.కె.మార్బిల్స్ సంస్థకు చెందిన ఒక కార్యాలయంపై ఆదాయపన్ను శాఖ అధికారులు ఇటీవల జరిపిన దాడుల్లో ఏకంగా రూ.13,000 కోట్లు నగదు పట్టుబడింది. ఒక గది నిండా నోట్లకట్టలు నీటుగా పేర్చి ఉండటం చూసి ఆదాయపన్ను శాఖ అధికారులు సైతం షాక్ అయ్యారు. వాటిలో భారత కరెన్సీ మాత్రమే కాకుండా అమెరికా డాలర్ల కట్టలు కూడా ఉన్నాయి. అధికారులు ఆ సొమ్మును స్వాధీనం చేసుకొని ఆ సంస్థ యజమానులను, అధికారులను పోలీసులకి అప్పగించారు. ప్రభుత్వం సుమారు ఏడాది పాటు సమయం ఇస్తే కేవలం రూ. 3770 మాత్రమే వసూలు కాగా, ఆదాయపన్నుశాఖ అధికారులు జరిపిన ఒకే ఒక దాడిలో ఏకంగా రూ. 13, 000 కోట్లు పట్టుబడటం విశేషం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close