“నిపుణులు” ఇప్పటికీ అమాయకులుగానే కనిపిస్తున్నారా..!?

భారతదేశంలో ప్రస్తుతం హెల్త్ ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు ఉన్నాయి. కేంద్రం అధికారికంగా ప్రకటించలేదు కానీ… అంత కంటే దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. కరోనా బారిన పడుతున్న ప్రజలకు కనీసం ఆక్సిజన్ అందించలేని దౌర్భాగ్య పరస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితి వస్తుందని.. ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని గతంలోనే నిపుణుల కమిటీ హెచ్చరించింది. అయితే ఆ నిపుణుల్ని అమాయకుల కేటగిరి కింద జమ చేర్చేసిన కేంద్రం లైట్ తీసుకుంది. ఫలితంగా ఇండియా ఇప్పుడు కరోనా గుప్పిట్లో చిక్కుకుంది. ఇప్పుడు కూడా కేంద్రం మేలుకున్నట్లుగా కనిపించడం లేదు.

దేశ ప్రజల్ని కాపాడాలంటే.. ఒక్కటే మార్గమని.. అమెరికాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత డాక్టర్ అంటోనియో ఫౌచి దగ్గర్నుంచి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వరకూ అందరూ సూచనలు.. సలహాలు ఇస్తున్నారు. కానీ కేంద్రం వారంతా అమాయకులన్నట్లుగా చూస్తూ… లాక్ డౌన్ లేదు ఏమీ లేదని స్పష్టం చేస్తోంది. కేంద్రంలో ఉన్న కరోనా విస్తృతి.. లక్షల మంది ప్రాణాలను తీయబోతోందని.. దీనిని వీలైనంత వరకూ తగ్గించడానికి మార్గం లాక్ డౌన్ మాత్రమేననని.. ఆంటోనియా ఫౌచీ చెబుతున్నారు. ఆయన మార్గంలోనే ఇతర విదేశీ నిపుణులు సలహాలిచ్చారు. ఎయిమ్స్ చీఫ్ గులేరియా కూడా అదే చెప్పారు. ఇప్పుడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా అదే సలహా ఇచ్చారు.

నిజానికి లాక్ డౌన్ విధించడం ప్రజలకు మాత్రమే… భారత్ వైద్య వ్యవస్థకు కూడా మంచిది . లేకపోతే… ఆ వ్యవస్థలో కీలక వ్యక్తులు.. కరోనాకు బలయ్యే ప్రమాదం పొంచి ఉంది. అదే జరిగితే.. కొన్ని తరాల పాటు.. భారత ప్రజలు నాణ్యమైన వైద్యం కోసం… అల్లాడిపోవాల్సి ఉంటుంది. అయితే మొదటి లాక్ డౌన్ సమయంలో వచ్చి పడిన ఆర్థిక నష్టం ముందు మరే నష్టమూ.. పెద్దది కాదని అనుకుంటోంది. ఎంత మంది ప్రాణాలైనా పోనీ.. వైరస్ ఎంతయినా విజృంభించనీ… ఆర్థిక వ్యవస్థ మాత్రం గాడిన ఉండాలని.. కేంద్రం కోరుకుంటోంది. అందుకే … లాక్ డౌన్ విధించాలన్న సలహాలిస్తున్న వారందర్నీ… లైట్ తీసుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close