రేపు డిల్లీలో భారత్-పాక్ విదేశాంగ కార్యదర్శుల సమావేశం!

పఠాన్ కోట్ దాడుల తరువాత స్తంభించిపోయిన భారత్-పాక్ సంబంధాలు మళ్ళీ దారిన పడుతున్నట్లున్నాయి. జనవరిలో జరుగవలసిన భారత్-పాక్ విదేశాంగ కార్యదర్శుల సమావేశం పఠాన్ కోట్ దాడుల కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. నాలుగు నెలలు గడిచిపోయినా ఇంతవరకు ఆ సమస్య పరిష్కారం కాలేదు. ఆ విషయంలో పాక్ చాలా చిత్రవిచిత్రంగా వ్యవహరిస్తోంది. అయినా మోడీ ప్రభుత్వం పాక్ తో చర్చలకే సిద్దపడుతున్నట్లుంది. పాక్ విదేశాంగ శాఖ ప్రధాన కార్యదర్శి ఐజాజ్ అహ్మద్ చౌదరి నేతృత్వంలో పాక్ సౌత్యవేత్తల బృందం డిల్లీలో జరుగబోయే ‘హార్ట్ ఆఫ్ ఏసియా’ సదస్సులో పాల్గొనేందుకు మంగళవారం డిల్లీకి వస్తోంది. తాలిబాన్ ఉగ్రవాదుల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆఫ్ఘనిస్తాన్ దేశంలో శాంతి నెలకొల్పేందుకు అవసరమయిన చర్యల గురించి చర్చించేందుకు 2011 నుంచి ప్రతీ ఏటా ఈ సదస్సు ఒక్కో దేశంలో నిర్వహించబడుతోంది. ఈసారి ఏప్రిల్ 26న డిల్లీలో నిర్వహింపబడుతోంది.

ఈ సదస్సులో పాల్గొనడానికి వస్తున్న పాక్ బృందం ఆ సందర్భంగా వారు భారత్ విదేశాంగ ప్రధాన కార్యదర్శి ఎస్. జైశంకర్ తో సమావేశమవుతారు. ఇది పూర్తి స్థాయి విదేశాంగ కార్యదర్శుల సమావేశం కాకపోయినా, అది భవిష్యతులో పూర్తి స్థాయి సమావేశానికి నాంది పలికేదేనని పాక్ చెపుటోంది. వారి వ్యాఖ్యలను భారత్ అంగీకరించలేదు అలాగని ఖండించకుండా మౌనం వహించింది. అంటే మౌనం అర్ధాంగీకారంగా భావించవచ్చు. రేపు ఇరుదేశాల కార్యదర్శులు, దౌత్య బృందాల మధ్య జరిగే సమావేశంలో ద్వైపాక్షిక సబంధాల గురించి చర్చించవచ్చునని ఐజాజ్ అహ్మద్ చౌదరి చెపుతున్నారు. భారత్-పాక్ దేశాల మధ్య సంబంధాలు మళ్ళీ పునరుద్దరించుకోవడానికి రేపటి సమావేశం ఉపయోగపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు.

రేపటి సమవేశంలో భారత్ విదేశాంగ ప్రధాన కార్యదర్శి ఎస్. జైశంకర్ పఠాన్ కోట్ దాడుల గురించి ప్రస్తావించి, పాక్ లో దర్యాప్తు జరిపేందుకు భారత్ ఎన్.ఐ.ఏ. బృందాన్ని అనుమతించవలసిందిగా కోరవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close