రాజధాని పిటిషన్లపై విచారణ ఇప్పుడల్లా కాదు..!

రాజధాని అమరావతిపై దాఖలైన పిటిషన్ల విచారణకు కరోనా అడ్డం పడుతోంది. గతంలో మే మూడోతేదీ నుంచి ఆయా పిటిషన్లపై విచారణ జరపాలని… ఏపీ హైకోర్టు నిర్ణయించింది. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా దిగజారాయి. దాంతో .. ఆగస్టు ఇరవై మూడో తేదీకి విచారణను వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. అప్పట్లో రోజువారీగా సాగిన అమరావతి పిటిషన్లపై విచారణకు ఏపీ హైకోర్టు సీజేగా ఉన్న జేకే మహేశ్వరి బదిలీ కావడంతో బ్రేక్ పడింది. అప్పట్లో రాజధాని కేసులన్నీ చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనంలో విచారణ జరిగేవి. కొత్త చీఫ్ జస్టిస్ రావడంతో ఆ పిటిషన్లపై విచారణ ఆగిపోయింది. కొత్త చీఫ్ జస్టిస్ వచ్చిన తర్వాత ఆ కేసులపై విచారణ సాగే అవకాశాలు కల్పించకపోవడంతో… అడ్వకేట్ జనరలే హైకోర్టుకు విన్నవించారు. ఆ పిటిషన్లపై విచారణ ప్రారంభించాలని కోరారు.

అడ్వకేట్ జనరల్ విజ్ఞప్తి మేరకు సీజే ఏకే గోస్వామి, జస్టిస్‌ బాగ్చీ, జస్టిస్‌ జయసూర్య ధర్మాసనం మే 3 నుంచి రాజధాని కేసులపై కోర్టులోనే భౌతికంగా విచారణ జరపాలని.. మార్చిలోనే నిర్ణయించారు. మళ్లీ మొదటి నుంచి వాదనలు వినాలని అనుకున్నారు. కానీ మే మూడో తేదీ వచ్చే సరికి హైకోర్టు ప్రత్యక్షంగాపని చేయలేని పరిస్థితి ఏర్పడింది. పైగా వేసవి సెలవులు కూడా ఉన్నాయి. అన్ని అంశాలను పరిశీలించిన హైకోర్టు.. తదుపరి విచారణ ఆగస్టు ఇరవై మూడో తేదీకి వాయిదా వేసింది.

రాజధాని అమరావతికి సంబంధించి పలు పిటిషన్లు హైకోర్టులో ఉన్నాయి. ప్రభుత్వ వికేంద్రీకరణ బిల్లు దగ్గర్నుంచి సీఆర్డీఏ రద్దు వరకూ అనేక పిటిషన్లు విచారణ జరగాల్సి ఉంది. రాజధానిని విశాఖకు తరలించేందుకు ప్రభుత్వం చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. కోర్టు విచారణ బాగా ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తూండటంతో కోర్టు ఆదేశాలతో సంబంధం లేకుండా రాజధానిని తరలించుకుని వెళ్తారా లేక… హైకోర్టు విచారణ ముగిసే వరకూ ఉంటార ాఅన్నది ఆసక్తికరంగా మారింది. హైకోర్టు రోజువారీ విచారణ చేపట్టి… ఏమైనా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికైనా బాగా సమయం పడుతుందని న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మాధవీలత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతబస్తీ గడ్డపై బీజేపీ ఎగరేసి ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు....

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close