`నెట్’కుంటూ పోతున్న జనం

జనమేజయ మహారాజు మహాబారతకథని చాలా శ్రద్ధగా వింటున్నాడు. వైశంపాయునుడు అంతే శ్రద్ధగా చెబుతున్నారు. వీరిలో ఒకరు శ్రోత అయితే, మరొకరు వక్త. జనమేజయుడు తనకు కలిగిన సందేహాలను వైశంపాయనుడి ముందు ఉంచుతున్నారు. వాటిని అరటిపండు ఒలిచినట్లు వివరిస్తూ సందేహాలు తీరుస్తున్నాడు వైశంపాయునుడు. అది ద్వాపర- కలియుగ సంధికాలం. ఈ భూమండలంలో జరిగే అనేకానేక విషయాలను జ్ఞానులైన మునులు వివరించేవారు. అలా విషయజ్ఞానం వేదకాలం నుంచి అందుతుండేది.

తాళపత్రాలమీద తాను సేకరించిన వైద్య పరిజ్ఞానాన్ని చరకుడు శ్రద్ధగా నిక్షిప్తం చేస్తున్నాడు. కొన్నాళ్లకి `చరకసంహితము’ పేరిట తాళపత్ర గ్రంథం తయారైంది. ముందుతరాలవారికి అందుబాటులో ఉంచేందుకు దాన్ని జాగ్రత్తగా భద్రపరిచారు. అది క్రీస్తు పూర్వం 8వ శతాబ్ది.

ముద్రణాయంత్రాలు వచ్చాయి. పుస్తకాలు అచ్చవడం మొదలైంది. తాళపత్ర గ్రంథాలు కనుమరుగయ్యాయి. పుస్తకాలు కోకొల్లలుగా అచ్చవుతున్నాయి. ముఖ్యమైన పుస్తకాలను ఒకచోట చేర్చి గ్రంథాలయాలను స్థాపించారు. విషయజ్ఞాన సేకరణకోసం ప్రజలు గ్రంథాలయాలను ఆశ్రయించడం మొదలుపెట్టారు. ఇది 18వ శతాబ్ది.

ఇప్పుడు నడుస్తున్నది ఇంటర్నెట్ యుగం. ఒక విషయంమీద సమాచారం తెలుసుకోవాలన్నా, సందేహాలు తీర్చుకోవాలన్నా ఇప్పుడు మనలో చాలామంది మొదటచేసే పని- నెట్ కి వెళ్ళి సెర్చి ఇంజన్ లోకి దూరేయడం. సమాచారాన్ని పంపాలన్నా, అందిపుచ్చుకోవాలన్నా క్షణాల్లో జరిగిపోతోంది. ఒకటిరెండు దశాబ్దాల క్రిందట మనదేశంలో చాలామందికి ఇంటర్నెట్ పదం తెలియదు. కంప్యూటర్ అంటే భయం. కీ బోర్డ్ ముట్టుకోవాలంటే అదురు. ఏది నొక్కితే ఏమి జరిగిపోతుందోనన్న బెదురు. కేవలం కొంతమందికి మాత్రమే కంప్యూటర్ లో ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉండేవి. అలాంటిది ఇప్పుడు ఇంటర్నెట్ వాడకంలో సంఖ్యాపరంగా చూస్తే అమెరికానే దాటబోతున్నది. ఇది మనందరికీ గుడ్ న్యూస్.

తెల్లవారిన దగ్గరనుంచి, రాత్రి నిద్రలోకి జారుకునేదాకా ఇంటర్నెట్ ఓ స్నేహితునిగా వెంటే ఉంటున్నది. సోషల్ మీడియా నెట్ రంగంలోకి దిగగానే సమాచార వ్యవస్థ హద్దులు చెరిగిపోయాయి. ఏ చిన్న అవసరం వచ్చినా ఫేస్ బుక్, వాట్సప్ వంటి సాధనాలను ఉపయోగించుకుంటున్నారు. అలా జీవితంలో `నెట్’కుంటూ పోతున్నారు.

జనాభాలో అగ్రస్థానంలో ఉండటంతో చైనా సహజంగానే ఇంటర్నెట్ వాడకంలోనూ అగ్రస్థానంలోనే ఉంది. అక్కడ 60కోట్ల మంది నెట్ వాడుకుంటున్నారు. కాగా, మనదేశంలో వచ్చే నెలనాటికి వీరి సంఖ్య 40కోట్ల 20 లక్షలకు చేరుకుంటుందన్నది ఓ అంచనా.

ఇంటర్నెట్ యూజర్స్ సంఖ్య కోటి నుంచి పదికోట్లకు పెరగడానికి పదేళ్లు పట్టింది. అదే, పదికోట్లనుంచి 20కోట్లకు పెరగడానికి మూడేళ్లే పట్టింది. కాగా, 30 కోట్ల యూజర్స్ కేవలం ఏడాదిలో 40కోట్లకు పెరిగారు.

మొబైల్, నెట్ ఆధారిత సేవలు, సామాజిక వెబ్ సైట్లు, సమాచార అప్లికేషన్స్, నెట్ బ్యాంకింగ్, ఆన్ లైన్ షాపింగ్ వంటివి ఇక మరింత పుంజుకుంటాయి. ఇప్పటికే లక్షలకోట్ల బిజినెస్ ని సొంతం చేసుకున్న ఇ-కామర్స్ రంగం మరింత స్పీడ్ గా దూసుకుపోవడం ఖాయం.

ఒకప్పుడు మొబైల్ ఫోన్ వస్తుందన్న ఊహేలేదు. అదో ఆశ్చర్యకరమైన వస్తువుగా చాలాకాలం ఉండిపోయింది. వైర్ లెస్ ఫోన్లు రాకముందు కదులుతూ స్టైల్ గా ఫోన్లో మాట్లాడాలని మనిషి తెగ ఆరాటపడ్డాడు. బాగా సంపన్నుల ఇళ్లలో ల్యాండ్ లైన్ సెట్ కి చాంతాడంత వైర్ బిగించి , ఆ వైర్ కట్టని, ఫోన్ సెట్ ని వెండిపళ్లెలో ఉంచుకుని ఇంట్లో పనివాడు పట్టుకుని నడుస్తుంటే, ఇంటి యజమాని హుందాగా రిసీవర్ అందుకుని ఫోన్ లో మాట్లాడుతూ మెట్లుదిగుతుంటాడు. పాత సినిమాల్లో ఇలాంటి దృశ్యాలుండేవి. అంత వైర్ కట్ట, ఫోన్ సెట్ ని పట్టుకునే వ్యక్తి ఉండాలంటే అందరికీ సాధ్యంకాదని అనుకునేవారు. కానీ, కొన్ని దశాబ్దాలు గడిచేసరికి ఆ కల నిజమైంది. వైర్ లెస్ ఫోన్ సెట్లు వచ్చాయి. తర్వాత మొబైల్ ఫోన్లు చేతిలో ఇమిడిపోయాయి. ఇప్పుడు అవి కేవలం ఫోన్ గానే కాకుండా మల్టీపర్పస్ డివైజ్ గా మారిపోయింది. నెట్ ఫెసిలిటీ వచ్చేసింది. దీంతో ఇక దాన్ని వదిలించుకునే పరిస్థితే లేదు. ఇప్పుడు టివీ కూడా మల్టీపర్పస్ గా మారిపోయింది. టివీలో నెట్ కనెక్షన్ రావడంతో స్మార్ట్ టివీలుగా మారిపోయాయి. టివీలు తనకుతానే హద్దులను చెరిపేసుకుంది.

సమాజంలోమంచి చెడులున్నట్టుగానే నెట్ వాడకంలో మంచిచెడ్డలున్నాయి. నెట్ వాడకాన్ని సమాజపురోభివృద్ధికి, వినోదానికి వాడుకుంటే ఫర్వాలేదు. అలాకాకుండా విధ్వంస చర్యలకు ఉపయోగించుకోవడం బాధకలిగించే విషయం.

నెటిజెన్లు తలచుకుంటే సామాజిక విప్లవాలు సృష్టించగలరు. ప్రభుత్వాలను ఏర్పాటుచేయగలరు, అలాగే కూల్చనూగలరు. ఇంతటి శక్తి ఉన్నదికనుకనే 125కోట్లకు పైగా ఉన్న భారతదేశంలో ఇది బాగా పాతుకుపోతోంది. ఇప్పటికి 40శాతం దగ్గరున్న యూజర్స్ సంఖ్య వచ్చే ఏడాదికి 50కోట్లకు చేరవచ్చు. కేవలం రెండుమూడేళ్లలోనే యూజర్స్ సంఖ్య 80కోట్లకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘మిరాయ్‌’… 20 రోజుల్లోనే ఇంత తీశారా?

https://www.youtube.com/watch?v=xnubQ829q0c తేజ స‌జ్జా, కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి 'మిరాయ్‌' అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు తెలుగు 360 ముందే చెప్పింది. ఇప్పుడు అదే...

కోమ‌టిరెడ్డిలో మ‌రో కోణం… కొడుకు పేరుతో సేవ!

నిత్యం ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు... వేలాది మంది కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు.. హ‌డావిడి. వైఎస్ హాయం నుండి వేగంగా ఎదిగిన మంత్రి కోమటిరెడ్డి, సేవా కార్య‌క్ర‌మాల్లోనూ నేనున్నా అని అండ‌గా ఉంటారు. ముఖ్యంగా కోమ‌టిరెడ్డి కుమార్...

పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా వెంకటేష్ నేత..?

తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాలపై కన్నేసిన బీజేపీ ప్రచారంలో వెనకబడిన అభ్యర్థులను మార్చాలని నిర్ణయం తీసుకోనుందా..? సర్వేలతో ఎప్పటికప్పుడు రాష్ట్రంలో పరిస్థితిని తెలుసుకుంటున్న జాతీయ నాయకత్వం పెద్దపల్లి లోక్ సభ అభ్యర్థిని మార్చనుందా..?...

మూడు రోజులు బయటకు రాకండి… వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!

తెలుగు రాష్ట్రాల్లో భానుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. రానున్న మరో మూడు రోజులపాటు 3 నుంచి 5 డిగ్రీల సెంటిగ్రేడ్ ల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close