వైసీపీకి గత ఎన్నికల్లో 11 సీట్లు రావడం తమ ఘనతేనని ఐ ప్యాక్ ప్రచారం చేసుకుంటోంది. తమ సిద్ధం క్యాంపెయిన్కు అవార్డులు వచ్చాయని గ్రాఫిక్స్లు రిలీజ్ చేసుకుని డబ్బా కొట్టుకుంటోంది. ఆవేశ్ కుమార్ సింగ్ అనే ఐ ప్యాక్ వ్యక్తి సోషల్ మీడియాలో తమ ప్రచార వ్యూహాలకు పోలారిస్ అవార్డులు వచ్చాయని వీడియోలు పోస్టు చేసుకున్నారు. సిద్ధం సభలను అందులో చెప్పుకున్నారు.
మొదటే.. జగన్ రెడ్డి ప్రసంగాలు గోల అనే అర్థంలో.. నాయిస్ అని ట్యాగ్ పెట్టి జగన్ యామినేషన్ బొమ్మను పెట్టారు. అంటే ఆయన ఓ గోల క్యాండిటేట్..దాన్ని మేము కరెక్ట్ గా క్యాంపెయిన్ చేసే దారిలో పెట్టామని చెప్పుకున్నారు. ఏం చేశారంటే సిద్ధం సభలను క్యాంపెయిన్ చేశారట. ఆ ప్రచారం జగన్ రెడ్డిని ఎక్కడికి తీసుకెళ్లిందో కళ్ల ముందే ఉంది. ఇప్పుడు తమకు పోలారిస్ అవార్డులు వచ్చాయని వారు ప్రచారం చేసుకుంటున్నారు.
జగన్ రెడ్డి ప్రస్తుతం ఐ ప్యాక్ సేవలు తీసుకుంటున్నారో లేదో స్పష్టత లేదు. కానీ ఆ డ్రామాలు మాత్రం కంటిన్యూ అవుతున్నారు. ఐ ప్యాక్ కు ఇప్పుడు ఎవరూ క్లయింట్లుగా లేరు. ప్రశాంత్ కిషోర్ వదిలేసిన తర్వాత ఐ ప్యాక్ మట్టికొట్టుకుపోయింది. తనతో పాటు చాలా పార్టీలకు అదే గతి పట్టించింది. ఇప్పుడు మళ్లీ ఓ క్లయింట్ కోసం చూస్తోంది. వారికి జగన్ బాగా కనిపిస్తున్నట్లుగా ఉన్నారు. మళ్లీ సిద్ధం సభల్ని చూపించి ఆయన దగ్గర చేరేందుకు ప్లాన్ చేస్తున్నారు .
అయితే ఆ ప్లాన్ రివర్స్ లో ఉంది. జగన్కు వచ్చిన పదకొండు సీట్లు..తమ ప్రచార ఫలితమేనని వారు చెప్పుకుంటున్నారు. అక్కడేరివర్స్ అవుతోంది. జగన్ పరువు పోతోంది.