ట్రంప్ ట్వీట్ చేసినట్లుగా .. ఇరాన్, ఇజ్రాయెల్ కాల్పుల విరమణ పాటిస్తున్నట్లుగా ప్రకటించాయి. దాంతో యుద్ధం ఆగిపోయినట్లయింది. మరి ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు అంటే.. యుద్ధం అంటేనే వినాశనం. ఎవరూ గెలిచేది ఉండదు.ఇక్కడ కూడా అదే జరిగింది. అసలు ప్రారంభించిన ఇజ్రాయెల్ కూడా భారీగా నష్టపోయింది. ఇరాన్ కు ఇంకా ఎక్కువ నష్టం జరిగింది. అయితే ఇరాన్ అమెరికానూ దెబ్బకొట్టింది. ఇంతా చేసి ఇరాన్ అణు కార్యక్రమం పూర్తిగా దెబ్బతిన్నదా అంటే.. అదేమీ లేదు. మా అణు కార్యక్రమం ఆగబోదని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమైనీ ప్రకటించారు.
ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేసుకుంటోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తూ దాడులు చేసింది. అంతకు ముందే ఇరాన్ ..తమతో అణు ఒప్పందం చేసుకోవాలని అమెరికా డిమాండ్ చేస్తూ వచ్చింది. కానీ అమెరికా పెట్టే షరతులు తేడాగా ఉండటంతో ఇరాన్ అంగీకరించలేదు. దాంతో ఇజ్రాయెల్ ను అమెరికా రెచ్చగొట్టింది. యుద్ధం ప్రారంభమయ్యాక.. ట్రంప్ కూడా.. ఇరాన్ పై దాడి చేయించారు. వారి అణు కేంద్రాలపై దాడులు చేశారు. ప్రతిగా ఇరాన్ ఖతార్ లోని అమెరికన్ ఎయిర్ ఫోర్స్ బేస్ పై దాడులు చేసింది.
ఇలా అన్ని దేశాలు నష్టపోయాయి. వందల ప్రాణాలు పోయాయి. ఇరాన్, ఇజ్రాయెల్ రెండు దేశాల్లోనూ ప్రజలు నష్టపోయారు. పశ్చిమాసియాలో వీరి తీరు వల్ల ఇప్పుడల్లా.. శాంతి నెలకొనే అవకాశాలు లేవు. రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టి అమెరికా చలి కాచుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిణామాలు.. ముందు ముందు ఉద్రిక్త పరిస్థితులకు కారణం అయ్యే అవకాశాలు ఉన్నాయి.