బీజేపీ వ్యతిరేకతే వారందరినీ హైదరాబాద్ రప్పిస్తోందా?

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్ధి రోహిత్ మృతిపై రాజకీయపార్టీల నుండి ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా స్పందిస్తున్నాయి. రోహిత్ తల్లిని పరమార్శించేందుకు అన్ని పార్టీల నేతలు క్యూ కడుతున్నారు. నిన్న రాహుల్ గాంధీ పరామర్శ పూర్తయిన తరువాత వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఇవ్వాళ్ళ డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సీపిఎం నేత సీతారం ఏచూరి, బీ.ఎస్.పి. అధినేత్రి మాయావతి, ఆర్.పి.ఐ. నేత రాందాస్ అధ్వాలే మొదలయిన వారు రోహిత్ తల్లిని పరామర్శించదానికి వస్తున్నారు. ఆమె చేతికి అందివచ్చిన కొడుకుని కోల్పోయి బాధపడుతుంటే, వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నేతలు అందరూ ఈ విషాద సంఘటన ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని ఆత్రుతతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అక్కడి నుండి ఆమె వద్దకు క్యూ కట్టి వస్తున్నారు. దాని వలన ఆమె కడుపుకోత చల్లారదు కానీ అందరూ కలిసి ఆ గాయాన్ని కెలికినట్లవుతోంది.

ఇదివరకు సుష్మా స్వరాజ్, వసుంధర రాజే, శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామాలకు పట్టుబడుతూ పార్లమెంటును స్తంభింపజేసిన కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు వచ్చే నెలనుండి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలలో, కేంద్ర మానవ వనరుల అభివృది శాఖ మంత్రి స్మృతీ ఇరానీ, కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఇద్దరూ రోహిత్ మృతికి కారకులని ఆరోపిస్తూ వారి రాజీనామాలకు పట్టుబడుతుందేమో? ఈ విషాద ఘటనపై చాలా తీవ్రంగా స్పందిస్తున్న రాజకీయ పార్టీలన్నిటినీ గమనించినట్లయితే, అవన్నీ బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నవేనని అర్ధం అవుతుంది. అంటే బీజేపీ పట్ల వాటికున్న వ్యతిరేకత వాటన్నిటినీ ఈ సంఘటనతో ఒక్క త్రాటిపైకి వస్తున్నట్లు అనుమానం కలుగుతోంది. కనుక శవరాజకీయాలు చేయడానికి తరలివస్తున్న రాజకీయ నేతలను విద్యార్ధులు దూరంగా ఉంచితే మంచిది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంత్రి బుగ్గన సిబ్బంది బెదిరింపులు…మహిళ సూసైడ్..!?

ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సిబ్బంది అత్యుత్సాహం ఓ మహిళా నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి.కనీస మానవత్వం చూపకుండా బెదిరింపులకు దిగడంతో ఓ నిరుపేద మహిళా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కోనసీమ జిల్లా కొత్తపేటకు...

మేనిఫెస్టో మోసాలు : జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ ఏది బ్రో !

చంద్రబాబునాయుడు నిరుద్యోగ యువత కోసం నిరుద్యోగ భృతి పథకం పెట్టి.. భృతి ఇచ్చి.. ఇలా భృతి తీసుకునేవాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఎప్పటికప్పుడు ఉద్యోగాలిచ్చేలా వ్యవస్థను సృష్టిస్తే.. జగన్ ెడ్డి ఏపీకి...

అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి…కవితకు బెయిల్ దక్కేనా..?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ అధికారుల వద్ద అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి తాజాగా సీబీఐ అధికారుల ముందు కూడా అప్రూవర్...

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close