ఏపీ ఉద్యోగ సంఘ నేతలను వ్యూహాత్మకంగా అవమానిస్తున్నారా !?

ముఖ్యమంత్రి జగన్, ఆర్థిక మంత్రి బుగ్గన కావాలనే ఉద్యోగుల్ని, ఉద్యోగ సంఘ నేతల్ని తీవ్రంగా అవమానించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా ఉన్నారు. పీఆర్సీ కోసం అదే పనిగా పోరాటం చేస్తున్న ఉద్యోగ సంఘాల నేతలతో కనీసం ఓ మాట కూడా మాట్లాడని సీఎం జగన్ .. వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించడానికి తిరుపతికి వెళ్లి.. అక్కడలోకల్‌లో ఉండే కొంత మంది వైసీపీ సానుభూతిపరులైన ఉద్యోగుల్ని తన వద్దకు పిలిపించుకున్నారు. వారికి పీఆర్సీ గురించి వివరించారు.

మొత్తం సిద్ధమైపోయిందని పది రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని చెప్పారు.దీంతో వారు చాలా ఉత్సాహంగా బయటకు వచ్చారు. నిజానికి పీఆర్సీ ప్రకటన చేయాల్సింది తిరుపతిలో తమకు అనుకూలంగా ఉన్న ఉద్యోగుల్ని పిలిపించి కాదు కదా… నేరుగా ఉద్యోగ సంఘాలతో భేటీలో చెప్పవచ్చు కదా అనే సందేహం చాలా మందికి వస్తోంది. పైగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి కూడా ఆవిషయాన్ని తిరుపతిలో జగన్ చెప్పడమే ఆశ్చర్యానికి కారణం అవుతోంది. అయితే ఈ అంశంపై ఉద్యోగ సంఘాల నేతలు బ్యాలెన్స్‌డ్‌గా స్పందిస్తారు. సీఎం అలా ప్రకటించారన్న విషయం మీడియాలోనే చూశామని.. తమకు సమాచారం రాలేదన్నారు.

సీఎం పీఆర్సీ ప్రకటిస్తే తమకూ సంతోషమేనన్నారు. అయితే అదొక్కటే సమస్య కాదని .. ఇంకా ఉన్నాయని గుర్తుచేస్తున్నారు. ఓ వైపు ఆర్థిక మంత్రి బుగ్గన అసెంబ్లీలో కూడా ఉద్యోగుల్ని కించ పరుస్తున్నారు. జగన్ మరో రూట్లో వెళ్తున్నారు. దీంతో ఉద్యోగ సంఘ నేతలు ప్రభుత్వం తమతో విభజించు.. పాలించు అనే సూత్రం అమలు చేస్తోందేమోనని ఆందోళన చెందుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

యాక్సిడెంట్ కేసులో ర‌ఘుబాబు

సినీ న‌టుడు ర‌ఘుబాబు చిక్కుల్లో ప‌డ్డారు. ఆయ‌న‌పై ఓ యాక్సిడెంట్ కేసు న‌మోదైంది. హైద‌రాబాద్ నుంచి గుంటూరు కారులో వెళ్తున్న ర‌ఘుబాబు న‌ల్గొండ జిల్లా నార్క‌ట్ ప‌ల్లి - అద్దంకి ర‌హ‌దారి వ‌ద్ద...

బొండా ఉమ వైపే రాయి – వైసీపీ చీప్ ట్రిక్కులు !

రాయి రాజకీయాన్ని బొండా ఉమ వైపు తిప్పడానికి కుట్ర సిద్ధాంత నిపుణుడు సజ్జల రామకృష్ణారెడ్డి... పోలీసులతో కలిసి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వడ్డెర బస్తీ పిల్లల్ని టార్గెట్ చేసిన తర్వాత...

నాటి టీడీపీ పరిస్థితే నేడు వైసీపీది !

2019 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా జాతీయ సర్వేలు వచ్చాయి. ఆ సర్వేలన్నింటిలో.. వైసీపీ భారీ విజయం సాధించబోతోందని అంచనా వేశాయి. కానీ తెలుగుదేశం పార్టీ నేతలు అవన్నీ పెయిడ్...

వైసీపీని “చెత్త కుప్ప”ల్లోకి చేర్చిన అంబటి రాంబాబు !

ఎన్నికల ప్రచారం చేయాలంటే ఓ ఆలోచన ఉండాలి. కానీ ఆ ఆలోచన వింతగా ఉంటే మాత్రం రివర్స్ అవుతుంది. దానికి అంబటి రాంబాబే సాక్ష్యం. ఇప్పుడు సత్తెనపల్లిలో ఎక్కడ చూసినా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close