ఈవీఎంలను బాగు చేసిన వాళ్లెవరో ద్వివేదీకి కూడా తెలియదా..?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసిన వారం రోజుల తర్వాత అవకతవకలన్నీ బయటకు వస్తున్నాయి. పోలింగ్ రోజు ఈవీఎంల మొరాయింపు వ్యవహారంపై… తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చే వ్యవహారాలు వెలుగు చూస్తున్నాయి. ఉదయం సమయంలో.. కొన్ని వేల ఈవీఎంలు మొరాయించాయి. వాటిని ఎవరు రిపేర్ చేశారన్నదానిపై.. ఇంత వరకూ… క్లారిటీ లేదు. కానీ.. ఈవీఎంల సమస్యలు వస్తే… పరిష్కరించడానికి నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున.. ఈవీఎంలు తయారు చేసిన బీహెచ్ఈఎల్ ఇంజినీర్లను కేటాయించారు. కానీ… ఆ ఇంజినీర్లను.. ఎక్కడా ఉపయోగించుకోలేదన్న ప్రచారం జరుగుతోంది.

ఏపీలో మొత్తం ఆరు వందల మంది భెల్ ఇంజినీర్లు… పోలింగ్ రోజు విధులు నిర్వహించారని.. అయితే.. ఎంత మందితో… ఈవీఎంల సర్వీస్ చేయించుకున్నారో సమాచారం లేదు. ఈ విషయంపై సీఈవో ద్వివేదీ కలెక్టర్ల నుంచి వివరణ కోరారు. రాష్ట్రానికి 600మంది భెల్‌ నిపుణులు వచ్చినా… వారి సేవలు వాడలేదని… నివేదిక ఇవ్వాలని కోరారు. రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని కలెక్టర్లను ద్వివేది ఆదేశించారు. ఉద్దేశపూర్వకంగా తప్పులు చేస్తే ఎఫ్ఐఆర్‌ నమోదు చేస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. కృష్ణా జిల్లాలో పెనుమలూరులో ఈవీఎంలను ఆర్వో ఆలస్యంగా అప్పగించడం, రాజాంలో మైనర్లు ఓటు వేసిన ఘటనలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

మొత్తానికి వారం రోజులుగా.. పోలింగ్‌లో ఈవీఎం మెషిన్లు మొరాయించడం దగ్గర్నుంచి అనేక అంశాలపై టీడీపీ అధినేత తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా.. ద్వివేదీ అవే అంశాలపై… కలెక్టర్ల నుంచి నివేదికలు కోరుతున్నారు. అయితే.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం… ఈసీ పనితీరును భేష్ అంటున్నారు. ఈ పరిణామాలతో.. ఏపీలో జరిగిన పోలింగ్ తీరుపై… తీవ్రమైన అనుమానాలు రేకెత్తే పరిస్థితి ఏర్పడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

పరశురాం డబ్బులు వెనక్కి ఇస్తాడా ?

ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచింది. విజయ్ దేవరకొండ, పరసురాం సక్సెస్ కాంబినేషన్ లో మంచి అంచనాలతో వచ్చిన సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. గీతగోవిందం మ్యాజిక్ మరోసారి వర్క్ అవుట్ అవుతుందని భావించారంతా. కానీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close