ఉత్తరాంద్ర నుంచి విజయసాయిరెడ్డి గెటౌట్ !

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర ఇంచార్జిగా ఉన్న విజయసాయిరెడ్డికి ఆ పదవి ఊడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయనకు ఇకపార్టీ తరపున ఏ ఒక్క జిల్లా బాధ్యతలు కూడా ఇవ్వకూడదని జగన్మోహన్ రెడ్డి డిసైడయినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు జిల్లాల ఇంచార్జిలను జగన్ ఖరారు చేశారు. వాటిలో విజయసాయిరెడ్డి పేరు ఎక్కడా కనిపించలేదు. ఇప్పటి వరకూ రాష్ట్రం మొత్తం నలుగురు చేతుల్లో ఉండేది. ఉత్తరాంధ్ర విజయసాయిరెడ్డి, ఉభయగోదావరి జిల్లా వైవీ సుబ్బారెడ్డి, కోస్తా జిల్లాలకు సజ్జల.. రాయలసీమకు పెద్దిరెడ్డి, వేమిరెడ్డి వంటి వారు ఇంచార్జులుగా ఉండేవారు.

వారే వ్యవహాలు నడిపేవారు. ఇప్పుడు అందర్నీ మార్చేయబోతున్నారు. విజయసాయిరెడ్డిని పూర్తిగా పక్కన పెట్టనున్నారు. ఆయనకు కేంద్ర కార్యాలయ సమన్వయ బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది. అదీ లేకపోతే… మొత్తంగా పక్కన పెట్టే అవకాశం ఉందంటున్నారు. ఉత్తరాంద్రలో ఆయన పార్టీని నాశనం చేశారన్న అభిప్రాయంతో సీఎం జగన్ ఉన్నట్లుగా చెబుతున్నారు. ప్రత్ేయకంగా పీకే టీం ద్వారా ఆయన సర్వేలు కూడా చేయించారు. చివరికి పార్టీ వ్యవహారాల్లో వేలు పెట్టనీయకపోవడమే మంచిదని అనుకుంటున్నారు.

జాబ్ మేళాలు కూడా పార్టీ హైకమాండ్ కు ఇష్టం లేదని.. కానీ విజయసాయిరెడ్డి మొండిగా పెట్టారని అంటున్నారు. అందుకే పార్టీ నేతలెవరూ ఆయనను కలవొద్దని ముందుగానే సందేశం పంపారని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. విజయసాయిరెడ్డి పరిస్థితి వైసీపీలో రాను రాను తీసికట్టుగా మారుతోంది. రేపు రాజ్యసభ స్థానం కూడా రెన్యూవల్ చేయకపోతే.. వైసీపీలో ఆయన చాప్టర్ క్లోజ్ అయినట్లేనని కొంత మంది చర్చించుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close