వంద కోట్ల సినిమా… చేజారిన‌ట్టేనా?!

ఓ ఫ్లాపు, ఓ హిట్లూ… అంటూ సాగుతోంది ర‌మేష్ వ‌ర్మ కెరీర్‌. రాక్ష‌సుడు హిట్టుతో మ‌ళ్లీ పెద్దహీరోల దృష్టిలోప‌డ్డాడు. ర‌వితేజ‌ని ఒప్పించి `ఖిలాడి` ప‌ట్టాలెక్కించాడు. ఖిలాడి సినిమా ఇప్పుడు ఫ్లాప్ అవ్వొచ్చు గానీ, విడుద‌లకు ముందు ఈ సినిమాపై ఉన్న బ‌జ్ అంతా ఇంతా కాదు. ర‌షెష్ చూసిన నిర్మాత కోనేరు స‌త్య‌నారాయ‌ణ‌… త‌న డైరెక్ట‌ర్ పై ప్రేమ‌తో ఓ ఖ‌రీదైన కారుని కూడా బ‌హుమ‌తిగా ఇచ్చాడు. అంతేనా? `యోధ‌` అనే వంద కోట్ల ప్రాజెక్టు కూడా ప్ర‌క‌టించేశాడు. ఇదో పాన్ ఇండియా సినిమా అని, పెద్ద స్టార్ న‌టించ‌బోతున్నాడ‌ని మీడియాకి చెప్పేశారు.

అయితే ఖిలాడీ రిలీజ్ అయ్యింది. నిర్మాత ఆశ‌ల‌కు, అంచ‌నాల‌కూ తూట్లు పొడుస్తూ, సినిమా అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యింది. దాంతో ర‌మేష్ వ‌ర్మ డీలా ప‌డిపోయాడు. ఈ సినిమాకొచ్చిన రివ్యూలూ, అవుట్ పుట్ చూస్తే… ర‌మేష్ వ‌ర్మ చేతిలో వంద కోట్లు పెట్ట‌డం అత్యంత పెద్ద రిస్క్ అవుతుంది. ఆ సినిమా ర‌మేష్ వ‌ర్మ చేజారిపోయిన‌ట్టే. అయితే ఇక్క‌డ ఓ చిన్న అవ‌కాశం, ఆశ మిణుకు మిణుకుమంటున్నాయి. ఖిలాడీ కంటే ముందే.. `రాక్ష‌సుడు 2` ప్రాజెక్టు సెట్ అయ్యింది. కోనేరు స‌త్య‌నారాయ‌ణే నిర్మాత‌. ఆసినిమాని త‌క్కువ బ‌డ్జెట్ లో తీసి, సీక్వెల్ క్రేజ్ తో ఎక్కువ లాభాలు సంపాదించొచ్చ‌న్న‌ది ప్లాన్‌. పైగా.. స్క్రిప్టు కూడా బాగా వ‌చ్చింద‌ని టాక్‌. ఆ సినిమా ఏదోలా ప‌ట్టాలెక్కించేసి, దాన్ని హిట్ చేసి, మ‌ళ్లీ పెద్ద హీరోల దృష్టిలో ప‌డాల‌ని చూస్తున్నాడు ర‌మేష్ వ‌ర్మ‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ బెంగళూర్ టూర్.. కథేంటి?

ఇప్పటికే ఇండియా కూటమికి చేరువయ్యేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రచారం గుప్పుమంటోన్న నేపథ్యంలో జగన్ బెంగళూర్ పర్యటన సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఇటీవలే హడావిడిగా బెంగళూర్ నుంచి వచ్చి..ఆపై ఢిల్లీ ధర్నా అని చెప్పి...అక్కడి...

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close