కేసీఆర్‌ స్వాగతాన్ని మోడీ తిరస్కరించారా !?

ప్రధానమంత్రి తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం సీఎం వెళ్లి ఆహ్వానం పలకాలి. కానీ కేసీఆర్ వెళ్లడంలేదని ఓ సారి.. వెళ్తున్నారని ఓ సారి తెలంగాణ ప్రభుత్వ వర్గాలు ప్రచారం చేశాయి. చివరికి ఆ ముహుర్తం వచ్చే సరికి కేసీఆర్‌కు జ్వరం వచ్చిందని అందుకే ప్రధానికి స్వాగతం పలకడానికి వెళ్లలేదని మీడియాకు సమాచారం ఇచ్చారు. అసలు మోడీ పర్యటనలో కేసీఆర్ పాల్గొనడంపై గతంలో ఎప్పుడూ ఇంత గందరగోళం లేదు. వెళ్తే వెళ్తామని చెబుతారు లేకపోతే లేదు. కానీ ఈ సారి కేసీఆర్ ఏటూ తేల్చుకోలేని పరిస్థితి ఉన్నట్లుగా ఉంది.

తన తరపున ప్రోటోకాల్ స్వాగతం పలికేందుకు మంత్రి తలసానికి అధికారం ఇస్తూ సీఎంవో నుంచి ఉత్తర్వులు వచ్చాయి. రాత్రికల్లాకొన్ని మీడియా సంస్థలకు అది ప్రోటోకాల్ లెటరేనని.. కేసీఆర్ హాజరవుతారని సమాచారం ఇచ్చారు. ఉదయం అంతా అదే ప్రచారం చేశారు. మధ్యాహ్నానికి సీన్ మారిపోయింది. జ్వరం కారణంగా కేసీఆర్ మోడీ కి స్వాగతం పలకడానికి వెళ్లలేదని తెలుస్తోంది. అయితే కేసీఆర్‌ను తన పర్యటనలో పాల్గొనవద్దని మోడీనే చెప్పారన్న ప్రచారం జరుగుతోంది.

స్వాగతం పలికే విషయంలో ఇబ్బందికరంగా వ్యవహరించడమే కాకుండా … తాను పాల్గొనే కార్యక్రమాల్లో కేసీఆర్ నిరసన వ్యక్తం చేయడం వంటివిచేస్తే ఇబ్బందికరమని మోడీ గుర్తించినట్లుగా భావిస్తున్నారు. అందుకే ఇక్రిశాట్‌లో జరిగినకార్యక్రమంలోనూ కేసీఆర్ ను వద్దని చెప్పారని అంటున్నారు. మొత్తంగా చూస్తే బీజేపీతో చేయాల్సిన రాజకీయాల వ్యూహంలో కేసీఆర్ గందరగోళానికి గురవుతున్నారన్న అభిప్రాయం టీఆర్ఎస్‌లోనే ఏర్పడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close