వ‌ర్మ‌ని బెదిరించిన మాట నిజం కాదా..??

`లక్ష్మీస్ ఎన్టీఆర్‌`… ఈ టైటిల్ ఈమ‌ధ్య వినిపించ‌లేదు. ఎందుకంటే.. `ఎన్టీఆర్` బ‌యోపిక్ ప్ర‌క‌టించిన వెంట‌నే ఎంత హ‌డావుడిగా `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌` ప్ర‌క‌టించాడో, అంతే తొంద‌ర‌గా ఆ సినిమా గురించి మ‌ర్చిపోయాడు. వ‌ర్మ ఫామ్ లో లేక‌పోవ‌డం వ‌ల్లో ఏమో…. ఇంత‌టి స‌న్సేష‌న‌ల్ ప్రాజెక్టుకు కూడా ఏమాత్రం హైప్ రాకుండా పోయింది. `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` ప్రాజెక్టుని ఆపేయాల‌ని వ‌ర్మ‌ని కొంత‌మంది టీడీపీ నేత‌లు బెదిరించిన‌ట్టు తెలిసింది. ఎన్టీఆర్ వార‌సుల‌లోనే ఓ కీల‌క‌మైన వ్య‌క్తి… వ‌ర్మ‌ని ముంబైలో క‌ల‌సి `ఈ సినిమా చేయొద్దు` అన్నార్ట‌. దాంతో వ‌ర్మ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌ని ప‌క్క‌న పెట్టేశార‌ని వార్త‌లు వినిపించాయి. దాన్ని నిజం చేస్తూ… చాలా కాలం నుంచి వ‌ర్మ కూడా ఈ సినిమా ఊసెత్త‌లేదు. ఇప్పుడు స‌డ‌న్‌గా `ఎన్టీఆర్‌` బ‌యోపిక్‌ని రంగంలోకి దించాడు. జ‌న‌వ‌రిలో షూటింగ్ పూర్తి చేస్తాన‌ని క్లారిటీ కూడా ఇచ్చేశాడు. ఇదంతా చూస్తుంటే.. వ‌ర్మ మ‌రోసారి ఈ బ‌యోపిక్‌ని వాడుకుంటూ… ప‌బ్లిసిటీ స్టంట్ మొద‌లెట్టాడా? లేదంటే నిజంగానే ఈ సినిమా మొద‌లెట్టేస్తాడా? అనే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. `ఇదంతా ప‌బ్లిసిటీ స్టంట్ అని.. వ‌ర్మ ఈ సినిమా తీసే ఛాన్స్ లేద‌ని` నంద‌మూరి కాంపౌండ్ వ‌ర్గాలు అంటున్నాయి. నిజంగా `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌` గ‌నుక తీస్తే… వ‌ర్మ బెదిరింపుల‌పై వ‌చ్చిన వార్త‌లేవీ నిజం కాన‌ట్టే. ముంబై మాఫియా బెదిరింపుల‌కే లొంగ‌ని వ‌ర్మ‌… టీడీపీ నేత‌ల‌కు లొంగుతాడా??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

మాఫియాను అంతం చేసేందుకే కూటమి : అమిత్ షా

ఆంధ్రప్రదేశ్ భూ మాఫియాను అంతం చేసి అమరావతిని రాజధానిగా చేసేందుకు కూటమిగా ఏర్పడ్డమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ధర్మవరంలో ఎన్నికల ప్రచారసభకు హాజరయ్యారు. చంద్రబాబు కూడా అమిత్ షాతో...

విష ప్ర‌చారాన్ని తిప్పి కొట్టిన ‘గెట‌ప్’ శ్రీ‌ను!

'జ‌బ‌ర్‌ద‌స్త్' బ్యాచ్‌లో చాలామంది ఇప్పుడు పిఠాపురంలోనే ఉన్నారు. జ‌న‌సేనానికీ, కూట‌మికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తున్నారు. జ‌బ‌ర్‌ద‌స్త్ బ్యాచ్ ఇలా స్వ‌చ్ఛందంగా ప్ర‌చారానికి దిగ‌డం.. వైకాపా వ‌ర్గానికి న‌చ్చ‌డం లేదు. దాంతో వాళ్ల‌పై ర‌క‌ర‌కాల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close