రమణదీక్షితులకు ఇప్పటికీ తెలియడం లేదు !

జగన్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నానని ఆన్నీ అడిఆశలయ్యాయని మరోసారి రమణదీక్షితులు అసంతృప్తి వ్యక్తం చేశారు. జగన్ తిరుమల పర్యటన సందర్భంగా ఆయనకు పిలుపు రాలేదు. ఎలాంటి గౌరవమూ దక్కలేదు. దీంతో ఆయన ఫీలైనట్లుగా ఉన్నారు. వెంటనే ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసి.. గతంలో నియమించిన వన్ మ్యాన్ కమిటీ రిపోర్టును ప్రకటిస్తారని ఆశించామని కానీ జగన్ ఎలాంటి ప్రకటన చేయకపోవడం వల్ల చాలా నిరాశ చెందామన్నారు. టీటీడీలో బ్రాహ్మణ వ్యతిరేక సభ్యులున్నారని వారి నుంచి అర్చకుల్ని కాపాడటానికి వన్ మ్యాన్ కమిటీ రిపోర్టు ముఖ్యమన్నారు.

గతంలో తిరుమల ఆలయంలో చక్రం తిప్పే రమణదీక్షితులు ఏం ఆశించారో కానీ పింక్ డైమండ్ పేరుతో తప్పుడు ఆరోపణలు చేసి .. తెలుగుదేశం పార్టీపై బురద చల్లారు. ఆయన చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ వంటి చోట్ల కూడా ప్రెస్ మీట్లు పెట్టడంతో ఇదంతా కుట్రపూరిత ప్రచారం అని ప్రభు్త్వం నిర్ధారించుకుని ఆయనకు బలవంతంగా రిటైర్మెంట్ ఇచ్చింది. అప్పట్లో ఆయనకు జగన్ తాము అధికారంలోకి రాగానే మళ్లీ ప్రధాన అర్చకుడి పోస్టు ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటికీ ఆయనకు ఆలయంలో ప్రవేశం లేకుండా పోయింది.

రమణదీక్షితుల అవసరం కనిపించినప్పుల్లా ఒక్కో జీవో ఇస్తున్నారు. కానీ ఆ జీవోల వల్ల ఆయనకు ఒక్క రోజు సంతోషమే లభిస్తోంది కానీ.. మళ్లీ ఆలయంలో కీలకంగా వ్యవహరించే అవకాశం మాత్రం లభించడం లేదు. గత ఐదేళ్లుగా ఆయన పరిస్థితి అదే. జగన్ తన పోస్ట్ తనకు ఇస్తారని అనుకుంటున్నారు కానీ.. అలాంటి అవకాశం మాత్రం ఇవ్వడం లేదు. కానీ ఇప్పటికీ రమణదీక్షితులకు అర్థం కావడం లేదని ఆయన ట్వీట్ల ద్వారా తెలుస్తోంది. కొసమెరుపేమిటంటే రమణదీక్షితులు చేసిన ఆరోపణలు తప్పని.. పింక్ డైమండ్ లేదని ప్రస్తుత టీటీడీ బోర్డు కూడా తేల్చేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close