అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం ఏవియేషన్ నిపుణులను ఆశ్చర్య పరుస్తోంది. లండన్ వెళ్లడానికి ఇలా గాల్లోకి లేచిన నిమిషంలోపే కుప్పకూలిపోయింది. టేకాఫ్కు ఏటీసీ నుంచి పైలట్ పర్మిషన్ తీసుకుని రన్ వే నుంచి విమానాన్ని గాల్లోకి లేపారు. వెంటనే అత్యంత ప్రమాదకర పరిస్థితిని వివరించే మేడే కాల్ను ఏటీసీకి చేశారు. ఆ తర్వాత నిమిషంలోనే ఫ్లైట్ తెగిన గాలిపటంలా అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలోనే ఉన్న ఓ మెడికల్ కాలేజీ హాస్టల్ పై కూలిపోయింది.
విమానం కూలిపోతున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. గాలిపటం బాగా ఎత్తుకు వెళ్లిన తర్వాత తెగిపోతే అలా పడిపోతుందో అలా పడిపోయింది. ఫ్లైట్ పూర్తి సాంకేతిక సమస్యలతో వ్యవస్థ ఆగిపోవడం వల్లనే ఇలా జరుగుతుంది. ఏటీసీ తో కూడా సంబంధాలు తెగిపోయాయి. సాధారణంగా విమానం బయలుదేరే ముందు అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తారు. లండన్ దాకా వెళ్లడానికి సామర్థ్యం ఉందా లేదా అన్నది కూడా చూస్తారు. అంతర్జాతీయ విమానాలకు ఒక ఇంజిన్ ఫెయిల్ అయితే మరో ఇంజన్ ఉంటుంది. ఇక్కడ రెండు ఇంజిన్లు కాదు అసలు మొత్తం ఫ్లైట్ వ్యవస్థ పని చేయలేదని ఏవియేషన్ నిపుణులు చెబుతున్నారు.
ఈ ప్రమాదం వెనుక విద్రోహ చర్య ఉందో లేదో చెప్పడం కష్టంగా మారుతోంది. నేరుగా ఏదైనా వచ్చి ఢీకొట్టే ఆ విషయం తెలిసిపోతుంది. కానీ ఇక్కడ అలా ఏదీ ఢీకొనలేదు కాబట్టి బయట నుంచి వచ్చిన ముప్పు బయటపడలేదు.కానీ అంతర్గతంగా ఎవరైనా విమాన ప్రయాణికుల మాదిరిగా కుట్ర చేసి ఉండరని చెప్పలేం. విమానం ఎలా కూలిపోయిందో స్పష్టంగా తెలిస్తే కుట్ర కోణం విషయం వెలుగులోకి వస్తుంది. లేకపోతే మిస్టరీ ప్రమాదంగానే మిగిలిపోతుంది.