భారత్ కు అమెరికా నమ్మదగిన ఫ్రెండేనా?

“భారత్‌ లాంటి భాగస్వామి అమెరికాకు , అమెరికా లాంటి భాగస్వామి భారత్ కు ఇప్పుడు ఎంతో అవసరం గతంలో అడుగడుగునా ఆధిక్యతను కనబరిచే అమెరికా ఇప్పుడు ఇచ్చిపుచ్చుకునే ధోరణిక మారడం వల్ల ఆదేశంతో ఒప్పందాలు అంటే భయపడాల్సిన అవసరం ప్రస్తుతానికి కనిపించడం లేదు” ఇదే సారశంగా పత్రికలలోవిశ్లేషణలు సంకేతాలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ఒబామా, భారత ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు దేశాధినేతలు ప్రసంగించే ఐక్యరాజ్య సమితి వార్షిక సమావేశాలకు, మోదీ అమెరికాలో భారతీయులను ఉద్దేశించి 27 న మాట్లాడే సభకు పదిరోజులు ముందునుంచే అమెరికాలో అమెరికా, భారత్ అధికారుల సమావేశాలు విరివిగా జరుగుతున్నాయి. మీడియా పరంగా పరస్పరం ఆశిస్తున్న అంశాలను ఉభయదేశాల అధికారుల వెలిబుచ్చుతున్నారు.

పాకిస్తాన్‌తో కలిసి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న చైనా దూకుడును అడ్డుకోవడానికి అమెరికా అండాదండా ఇప్పుడు భారత్‌కు మరీ ముఖ్యం. భారత్‌, అమెరికా, జపాన్‌లు వాణిజ్య, రక్షణ రంగాల్లో గత కొద్ది కాలంగా కలిసి కదులుతున్నాయి. ఉగ్రవాదంపై నిజాయితీగా పోరాటం చేస్తున్న ప్రపంచ దేశాల్లో భారత్‌ ప్రధమ స్థానంలో ఉంటుంది. అదే విధంగా వాణిజ్యపరంగా కూడా భారత్‌ నమ్మదగిన మిత్రుడు.

అందుకే అమెరికా భారత్‌కు అనుకున్న మేరకు స్నేహ హస్తం అందించేందుకు ముందుకు వస్తున్నది. భారత దేశంతో తన రక్షణ సంబంధాలను మరింత వేగవంతం చేయడానికి, అలాగే ఆ దేశంలో హైటెక్‌ మిలిటరీ పరికరాలను సంయుక్తంగా అభివృద్ధి చేయడం, సంయుక్తంగా తయారు చేసే ప్రక్రియను వేగవంతం చేయడానికి అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్‌ ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. పెంటగాన్‌ ఒక దేశం కోసం ప్రత్యేకంగా ఇలాంటి విభాగాన్ని ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి.

నరేంద్రమోదీ ప్రభుత్వం వస్తు, సేవల జి ఎస్ టి పన్ను బిల్లు ఆమోదం సహా కీలకమైన సంస్కరణలను వేగంగా పూర్తి చేసి ఆర్ధిక వ్యవస్ధను పటిష్టం చేయాలని అమెరికాలో ఒబామా ప్ర‌భుత్వ సీనియ‌ర్ అధికారి నిషా దేశాయ్ బిస్వాల్ సూచించారు. ఆమె ఆదేశపు హోమ్‌ శాఖలో దక్షిణ, మధ్య ఆసియా విభాగానికి సహాయ కార్యదర్శి పదవిని చేపట్టిన తొలి భారత సంతతి అమెరికన్‌ మహిళ.

మోదీని భారతదేశపు గొప్ప ప్రచారకుడిగా (బ్రాండ్ అంబాసిడర్) నిషా దేశాయ్ అభివర్ణించారు. మోదీ సరళమైన విధానాలు, సాహసోపేతమైన నిర్ణయాలు అమెరికాలో ప్రయివేటు రంగం దృష్టిని భారత్ లో పెట్టుబడులపై దృష్టి పెట్టేలా చేశాయన్నారు. అయితే ప్రస్తుతం భారత్‌కు వెల్లువెత్తుతున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐలు), క్యాపిటల్‌ మార్కెట్లలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల కొనుగోళ్లు మాత్రమే మోదీ ప్రభుత్వం ఆశిస్తున్న అత్యున్నత పురోగతికి సరిపోవని ఆమె అభిప్రాయపడ్డారు వస్తూత్పత్తి రంగం, ఉపాధి కల్పన వంటి రంగాలు ఊపందుకునేందుకు వీలుగా మరిన్ని పెట్టుబడులు ప్రవహించాల్సి ఉన్నదని, తద్వారా ఆర్థిక వృద్ధి కూడా ఆశించిన స్థాయిలో పరుగుపెడుతుందని వివరించారు. మోదీ ప్రభుత్వ సంస్కరణల వేగాన్నిబట్టే ఇదంతా ఆధారపడి వుటుందన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి ప్రధాని మోడీ…షెడ్యూల్ ఇదే

ప్రధాని మోడీ ఏపీ ఎన్నికల పర్యటన ఖరారు అయింది.మే 3, 4తేదీలలో మోడీ ఏపీలో పర్యటించనున్నారు. 3న పీలేరు, విజయవాడలో పర్యటించనున్నారు. 4న రాజమండ్రి, అనకాపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు మోడీ. 3న...

నాలుగైదు సినిమాలకు అడ్వాన్సులు – గెలిచినా పవన్ బిజీనే !

పవన్ కల్యాణ్ ఎన్నికల తర్వాత కూడా తీరిక లేకుండా ఉంటారు. అయితే రాజకీయాలతో కాదు. సినిమాలతో. పవన్ కల్యాణ్ పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తులు,...

మేనిఫెస్టో మోసాలు : చేసింది జలయజ్ఞం కాదు జలభగ్నం !

వైఎస్ఆర్ జలయజ్ఞం.. వైఎస్ఆర్ కలలు కన్నారు. ఆ యజ్ఞాన్ని పూర్తి చేస్తాం. పోలవరం, వెలిగొండ యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తాం. రక్షిత మంచినీరు, సాగునీరు కల నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం .. జలకళను...

కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ గా హరీష్ రావు సవాళ్ళు..!?

బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక అటు కేసీఆర్, ఇటు హరీష్ రావు రాజకీయ వ్యూహాలు తేలిపోతున్నాయి. ప్రత్యర్ధులను కట్టడి చేసేందుకు చేస్తోన్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు మేలు చేయకపోగా...అధికార కాంగ్రెస్ కు ఫేవర్ చేసేలా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close